/rtv/media/media_files/2025/05/17/4pVsfaFimWoZKtRKzaQK.jpg)
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం కరూర్లో బెంగళూరు నుండి తమిళనాడులోని నాగర్కోయిల్కు వెళ్తున్న ప్రైవేట్ బస్సు ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బస్సు డ్రైవర్ ఫ్లైఓవర్ కిందకు దిగుతుండగా వాహనంపై నియంత్రణ కోల్పోయి ట్రాక్టర్ను ఢీకొట్టాడు. ఆ తర్వాత బస్సు బోల్తా పడి ఎదురుగా వస్తున్న వ్యాన్ను ఢీకొట్టింది.
Four people, including a 13-year-old girl, were killed and 15 others injured in a road accident on the #Salem–#Karur National Highway near #Karur's #Vennaimalai.@Dvincentaro
— TNIE Tamil Nadu (@xpresstn) May 17, 2025
Read more here:https://t.co/hYCTWA9gsm pic.twitter.com/0Cb39brI8L
Also Read : బ్యాండేజ్ సె*క్స్ చేస్తుండగా భార్య మృతి.. పోలీసుల దర్యాప్తులో ఊహించని ట్విస్ట్!
Also Read : TG JOB MELA: తెలంగాణలో భారీ జాబ్ మేళా.. 80 కంపెనీల్లో 5 వేల జాబ్స్.. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే!
ఐదుగురిలో ఒక బాలిక
బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కరూర్ టౌన్ డీఎస్పీ సెల్వరాజ్ వి సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. మరణించిన ఐదుగురిలో ఒక బాలిక కూడా ఉంది. గాయపడిన వారు ప్రస్తుతం కరూర్లోని స్థానిక ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను వెలికితీసి పోస్ట్మార్టం కోసం కరూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సు, ట్రాక్టర్, వ్యాన్ ముందు భాగాలు దెబ్బతిన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Sujatha : అల్లుడు ఆరోపణలు.. అత్త కౌంటర్.. ముదురుతోన్న విడాకుల పంచాయతీ!
tamil-nadu | bus-accident | telugu-news