హైదరాబాద్ లో వెలసిన పోస్టర్ లు గందరగోళం సృష్టిస్తున్నాయి. ఈరోజు, రేపు నగరంలోని తాజ్ కృష్ణలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. దీని కోసం కాంగ్రెస్ ముఖ్యనేతలు అందరూ హైదరాబాద్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో వారికి సంబంధించిన కాంట్రవర్శీ పోస్టర్లు అంటించడం కలకలాని దారి దీసింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సభ్యుల ఫొటోలు, వారు చేసిన స్కాముల వివరాలతో పోస్టర్ లు
హోర్డింగ్ లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా మొత్తం 24 మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల ఫొటోలు, వారి స్కాముల వివరాలతో పోస్టర్ లు పోస్టర్లగా అంటించారు. బివేర్ ఆఫ్ స్కామర్స్ అంటూ టాగ్ లైన్ తో వెలసిన పోస్టర్ లను ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. యూపీఏ హయాంలో జరిగిన స్కామ్ ల గురించి ప్రజలు మరోసారి చర్చించుకుంటున్నారు.
Congress Corruption Posters: హైదరాబాద్ లో కలకలం రేపుతున్న పోస్టర్లు
హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల నేపథ్యంలో పోస్టర్ లు కలకలం రేపుతున్నాయి. కరప్ట్ వర్కింగ్ కమిటీ అంటూ కాంగ్రెస్ నేతలు వారి మీద ఉన్న స్కామ్ లను ఫోటోలు వివరాలతో సహా పోస్టర్లను అంటించారు.
Translate this News: