NTR NEEL Update: ఎన్టీఆర్ సరసన 'సాహో' బ్యూటీ..!

ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న 'డ్రాగన్' సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కీలక పాత్రలో కనిపించే అవకాశముందని టాక్. అయితే ఇది ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. అయితే శ్రద్ధా ఎంట్రీ చిత్రానికి పెద్ద ప్లస్ అవుతుందని ఫిలిం వర్గాల్లో చర్చ నడుస్తోంది.

New Update

NTR NEEL Update: ఎన్టీఆర్ హీరోగా  తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమా గురించి మరో ఆసక్తికర అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఎన్నో ఊహాగానాలు వినిపించినా, తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే, ఈ సినిమాలో మరో క్రేజీ హీరోయిన్ జాయిన్ కాబోతుందట. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Also Read: 'ఈట్.. స్లీప్.. సలార్'.. బొమ్మ వచ్చి 500 రోజులు దాటినా ఊపు తగ్గలేదుగా!

శ్రద్ధా కపూర్ లాంటి స్టార్‌ హీరోయిన్ చేర్చడం సినిమాకే మేజర్ ప్లస్ పాయింట్ అయ్యింది. ఎన్టీఆర్ క్యారెక్టర్ డెవలప్‌మెంట్‌కి కూడా మంచి ప్లస్ అవుతుందని చెబుతున్నారు. అయితే ఇప్పటికీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు గానీ, ఫిలిం సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది.

ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్

ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) విషయానికి వస్తే, ఈ ప్రాజెక్ట్‌పై ఆయనకు ఉన్న డెడికేషన్ మాములుగా లేదు. కథపై పూర్తి ఫోకస్ పెట్టి తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్, ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ తీసిన సినిమాల్లో ఇది స్ట్రాంగ్ స్క్రిప్ట్ గా తెలుస్తోంది. అభిమానులకు ఊహించని స్థాయిలో విజువల్స్‌, మేకింగ్‌, కథనంతో ఈ సినిమాను తెరపై ఆవిష్కరించేందుకు ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ తో ఉన్నాడట.

Also Read: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్‌ కూడా మేమే

‘కేజీఎఫ్’ సిరీస్‌, ‘సలార్’ వంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమా, ఎన్టీఆర్ కెరీర్ లో మైలురాయిగా నిలవనుంది. “ఈ ప్రాజెక్ట్‌ను ఎన్టీఆర్‌పై ఉన్న గౌరవంతో, ప్రేమతో చేస్తున్నాను. ప్రేక్షకులు ఊహించని విధంగా సినిమాను రూపొందిస్తున్నా,” అంటూ గతంలో ప్రశాంత్ నీల్ చాల సందర్భాలలో పేర్కొన్నారు.

Also Read: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?

ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, ఈ సినిమాకి  ప్రశాంత్ నీల్ తన ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ తో కలిసి మరో సారి అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?

మొత్తానికి, ప్రతిరోజూ ఏదో ఒక కొత్త రూమర్ వినిపిస్తున్నప్పటికీ, అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ తెరపై ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు