సంధ్య థియేటర్‌ ఘటన.. బాధిత కుటుంబానికి మైత్రీ మూవీస్‌ భారీ సాయం

సంధ్య థియేటర్ ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబానికి 'పుష్ప2' నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్‌ ఆర్థికసాయం అందించారు. ఈ మేరకు నిర్మాత నవీన్‌ సోమవారం శ్రీ తేజ్ కుటుంబాన్ని పరామర్శించి, మృతురాలి కుటుంబానికి రూ.50లక్షల చెక్కును అందజేశారు.

New Update
mythri movies

mythri movies

'పుష్ప 2’ ప్రీమియర్‌ షో చూసేందుకు హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన్ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. 

ఆమె కుమారుడు శ్రీతేజ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబానికి 'పుష్ప2' నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్‌ ఆర్థికసాయం అందించారు. ఆ సంస్థకు చెందిన నిర్మాత నవీన్‌ యెర్నేని సోమవారం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మృతురాలి కుటుంబానికి రూ.50లక్షల చెక్కును అందించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు