అల్లు అర్జున్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పుష్ప 2’ రేపు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరో వైపు ఈ సినిమా టికెట్ రేట్లను పెంచేశారని మరికొందరు గగ్గోలు పెడుతున్నారు. ఈ తరుణంలో టికెట్ ధరలను తగ్గించాలని కోరుతూ ఇంకొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశాడు. టికెట్ రేట్ల పెంపుపై సుధీర్ఘ వివరణ ఇచ్చాడు.
Also Read: నాగచైతన్య హల్దీ ఫంక్షన్ లో అఖిల్ ఏం చేశాడో చూడండి.. ఫొటో వైరల్!
లాజిక్ ట్వీట్
‘పుష్ప2’ టికెట్లను స్టార్ హోటల్ ఇడ్లీతో పోల్చాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్ చేశాడు. ‘‘సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి, ప్లేట్ ఇడ్లీల ధరను రూ.1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు
కానీ కస్టమర్కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు సుబ్బారావు హోటల్కు వెళ్లడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప ఇంకెవ్వరూ కాదు. “సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజలకు అందుబాటులో లేదు” అని ఎవరైనా ఏడిస్తే, అది “సెవెన్స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు” అని ఏడ్చినంత వెర్రితనం
ఒకవేళ “సెవెన్స్టార్ హోటల్లో అంబియన్స్కి మనం ధర చెల్లిస్తున్నాం” అని వాదిస్తే, పుష్ప 2 విషయంలో ఆ సెవెన్స్టార్ క్వాలిటీ అనేది ఆ సినిమాఏ డెమొక్రాటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీదే పనిచేస్తుంది. అన్ని ప్రొడక్ట్స్ లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయి. అంతే కానీ ప్రజా సేవ కోసం కాదు. అప్పుడు లగ్జరీ కార్లపై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారు ?
Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?
ఎంటర్టైన్మెంట్ నిత్యావసరమా? ఇల్లు, తిండి, బట్టలు ఈ మూడింటి కన్నా ఎక్కువ అవసరమా?. అలా అయితే ఈ మూడు నిత్యావసరాల ధరలు బ్రాండింగ్ వున్నప్పుడు, ఆకాశాన్ని తాకుతుంటే, ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే. అలా అనుకొని వారు చూడటం మానెయ్యొచ్చూ, లేదా తర్వాత రేట్లు తగ్గాక చూసుకోవచ్చు కదా?
మల్లి సుబ్బారావు హోటల్ చైన్ విషయం కొస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయింది. దానికి ప్రూఫ్ ఏమిటంటే సుబ్బా రావు ఏ హోటల్లో కూడా కూర్చునే చోటు దొరకడం లేదు, అన్ని సీట్లు బుక్ అయిపోయాయి!’’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతోంది.