Yamadonga re release: 'మ్యాన్ ఆఫ్ మాసెస్' జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా నందమూరి అభిమానులను అదిరిపోయే గిఫ్ట్ ప్లాన్ చేశారు. తారక్ ఆల్ టైం సూపర్ హిట్ 'యమదొంగ' చిత్రాన్ని రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. 2007లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. మాస్ ఆడియన్స్ లో ఎన్టీఆర్ ఇమేజ్ ని మరింత పెంచింది. రూ. 29 కోట్ల వసూళ్లతో ఆఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు ఇందులో సీనియర్ ఎన్టీఆర్ ను యానిమేటెడ్ రూపంలో తిరిగి తెరపైకి తీసుకువచ్చారు. అలాంటి చిత్రం ఇప్పుడు మరోసారి బిగ్ స్క్రీన్ పై సందడి చేస్తుండడం అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది.
యమదొంగ రీరిలీజ్
మే 18న 'యమదొంగ' ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ కానుంది. ఆ తర్వాత 19, 20 తేదీల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. 'మ్యాన్ ఆఫ్ మాసెస్' ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీరిలీజ్ కానుంది అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఎస్. ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రియమణి, మమతా మోహన్ దాస్, అలీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం నాలుగు నంది అవార్డులు గెలుచుకోవడంతో పాటు ఎన్టీఆర్ ఉత్తమ నటనకు ఫిల్మ్ ఫేయిర్ అవార్డు వరించింది.
Also Read: Lucky Zodiac Signs: రేపు ఈ రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పు.. ఆ రాశుల లిస్ట్ ఇదే!
latest-news | cinema-news | ntr