Narayana Murthy: పవన్ కళ్యాణ్ అలా చేయడం సరైనది కాదు.. థియేటర్ల బంద్ పై ఆర్. నారాయణమూర్తి షాకింగ్ కామెంట్స్!

ఆర్.నారాయణమూర్తి తాజాగా జరిగిన మీడియా సమావేశంలో థియేటర్ల బంద్ వివాదంపై స్పందించారు. హరిహర వీరమల్లు కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది పూర్తిగా అవాస్తవమని అన్నారు. పవన్ నుంచి సినీ రంగంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ లేఖ రావడం సరికాదని అన్నారు.

New Update
Narayana Murthy comments on pawan kalyan

Narayana Murthy comments on pawan kalyan

Narayana Murthy: ప్రముఖ  నిర్మాత ఆర్. నారాయణమూర్తి  తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో థియేటర్ల బంద్,  డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మధ్య కొనసాగుతున్న పర్సెంటేజీల  వివాదాలపై  స్పందించారు. 

Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్

అలా చేస్తే గౌరవం పెరిగేది.. 

పవన్ కళ్యాణ్  హరిహర వీరమల్లు కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది పూర్తిగా అవాస్తవమని అన్నారు. ఈ విషయంలో పవన్ కార్యాలయం నుంచి సినీ రంగంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ  లేఖ రావడం సరైనది కాదని అసహనం వ్యక్తం చేశారు. హరిహర వీరమల్లు కోసం కాకుండా సినీ పరిశ్రమలోని సమస్యలపై  మాట్లాడదామని పిలిస్తే ఆయనపై  మరింతం గౌరవం పెరిగేదని అన్నారు. 

Also read: Pawan : మీకో దండంరా బాబు.. టాలీవుడ్ పై పవన్ ఫైర్!

అలాగే  డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మధ్య కొనసాగుతున్న పర్సెంటేజీల వివాదం గురించి మాట్లాడుతూ.. ''ప్రస్తుతం సింగిల్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకరమైందని వాపోయారు. పర్సంటేజి విధానాన్ని కోరుకునే వ్యక్తుల్లో తాను ఒకడినని .. పర్సంటేజిలు విధానం అమల్లోకి వస్తే  తనలాంటి  ఎంతో  మంది నిర్మాతలకు మేలు జరుగుతుందని తెలిపారు. ఎన్నోసార్లు పర్సెంటేజీల విషయాన్ని ఛాంబర్ ముందు పెట్టి ఆందోళనలు చేశామని. ఎంతో మంది ఛాంబర్ ప్రెసిడెంట్ లకు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

Also Read: కన్నప్ప హార్డ్ డ్రైవ్ ను మనోజ్ ఇంట్లో పని వాళ్ళే దొంగిలించారు..విష్ణు

పక్కదారి పట్టించవద్దు 

ఇప్పుడు సమస్య ఒక కొలిక్కి వచ్చే సమయంలో హరిహర వీరమల్లు సినిమాకు  లింకు పెట్టడం సరికాదని అన్నారు. పర్సెంటేజ్ విషయాన్ని పక్కదారి పట్టించవద్దని విజ్ఞప్తి చేశారు. చాలా మంది పెద్దలు కార్పొరేట్ సిస్టమ్ లకు వంతపాడుతున్నారు, మరి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏమైపోవాలి..? అని ప్రశ్నించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు దేవాలయలాంటివి.. కానీ ఇప్పుడు  కళ్యాణ మండపాలవుతున్నాయి. పర్సెంటేజ్ ని బతికించి నిర్మాతలను కాపాడాలి అని తెలిపారు.

Also Read: Miss World 2025: ప్రపంచం చూపులన్నీ HITEX మీదే! ఈరోజు గ్రాండ్ ఫినాలే హైలైట్స్ ఇవే

Advertisment
Advertisment
తాజా కథనాలు