Mohanbabu:ఎట్టకేలకు దిగొచ్చిన మోహన్ బాబు.. రిపోర్టర్ కు బహిరంగ క్షమాపణ

మంచు మోహన్ బాబు ఎట్టకేలకు దిగొచ్చారు. ఆయన దాడిలో తీవ్రంగా గాయపడి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిపోర్టర్ ను మోహన్ బాబు పరామర్శించారు. రంజిత్‌కు, కుటుంబసభ్యులకు సారీ చెప్పారు. దాడి రోజు తన వల్లే తప్పు జరిగిందని ఒప్పుకున్నారు.

New Update
mohan babu

మంచు ఫ్యామిలీ గొడవల్లో భాగంగా మోహన్ బాబు జర్నలిస్టు రంజిత్‌ పై దాడి చేయడం ఎంతటి వివాదానికి దారి తీసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ దాడిలో రిపోర్టర్ కి మూడుచోట్ల జైగోమాటిక్ ఎముక విరిగిందని వైద్యులు తెలిపారు. కంటికి, చెవికి మధ్య ఫ్రాక్చర్‌ కావడంతో 3 గంటలపాటు సర్జరీ చేయాల్సి వచ్చిందన్నారు.

Also Read: ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి తప్పిన ప్రమాదం

కాగా  మోహన్‌ బాబు పైశాచిక దాడిని జర్నలిస్ట్‌ సంఘాలు, రాజకీయ ప్రముఖులు ముక్త కంఠంతో ఖండించారు. ఈ దాడి ఘటనలో మోహన్‌ బాబుపై ఇప్పటికే హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టు ఆశ్రయించడం… ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించడంతో మోహన్‌బాబు కనపడకుండా పోయారు. ఆ తర్వాత తాను ఎక్కడికి పారిపోలేదని ఓ ఆడియో రిలీజ్ చేశారు.

Also Read :  2024లో లాంచ్ అయిన కిర్రాక్ ఫ్లాగ్ షిప్ ఫోన్లు.. మొత్తం ఎన్నంటే?

మోహన్ బాబు బహిరంగ క్షమాపణ..

ఇదిలా ఉంటే  ఆయన దాడిలో తీవ్రంగా గాయపడి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిపోర్టర్ ను మోహన్ బాబు పరామర్శించారు. రంజిత్‌కు, కుటుంబసభ్యులకు సారీ చెప్పారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సమాజానికి సారీ చెప్పాలని రంజిత్ కోరడంతో.. మోహన్ బాబు ఆ మేరకు జర్నలిస్టులకు బహిరంగ క్షమాపణ చెప్పారు. 

దాడి రోజు తన వల్లే తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. ఆ గాయం బాధ తనకు తెలుసంటూ రంజిత్ కుటుంబ సభ్యలను క్షమాపణ కోరారు. రంజిత్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు మోహన్ బాబు. ఈ సమయంలో మంచు విష్ణు కూడా మోహన్ బాబుతోనే ఉన్నారు.

Also Read: నేడే ‘బిగ్ బాస్-8’ లాస్ట్ డే.. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు