/rtv/media/media_files/2025/07/02/balakrishna-vishwak-sen-2025-07-02-15-03-19.jpg)
Balakrishna Vishwak sen
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' మూవీ 2018లో రిలీజై బిగ్గెస్ట్ హిట్ను అందుకుంది. అయితే ఈ మూవీకి సీక్వెల్ త్వరలోనే రాబోతున్నట్లు మూవీ టీం ఇటీవల అనౌన్స్ చేశారు. విశ్వక్ సేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్, వెంకటేశ్ కాకుమాను ముఖ్య పాత్రల్లో ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ 2018లో విడుదలై బిగ్గెస్ట్ హిట్ అందుకుంది.
ఇది కూడా చూడండి:Missing girl : సికింద్రాబాద్ లో బాలిక అదృశ్యం..అల్ఫాహోటల్ వైపు వెళ్లి.....
బాలకృష్ణ ఒక స్పెషల్ రోల్లో..
దీనికి సీక్వెల్గా 'ENE REPEAT' పేరుతో రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. విశ్వక్ సేన్తో కలిసి కొన్ని నిమిషాల పాటు ఓ ఇంట్రెస్టింగ్ క్యామియోలో కనిపించే అవకాశం ఉందట. ఇదే కనుక జరిగితే థియేటర్లలో రచ్చే రచ్చ.
ఇది కూడా చూడండి:మహారాష్ట్రలో దారుణం.. నడి రోడ్డులో 17ఏళ్ల బాలికపై లైంగికదాడి!
ఇద్దరు మాస్ హీరోలు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే ప్రేక్షకులకు పండగే. విశ్వక్సేన్ బాలకృష్ణకు వీరాభిమాని. ఈ విషయాన్ని విశ్వక్సేన్ పలు సందర్భాల్లో తెలియజేశాడు. వీరిద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఉంది. కాబట్టి ఈ సినిమాలో తప్పకుండా బాలయ్య గెస్ట్ రోల్ ఉంటుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇది కూడా చూడండి:Kannappa Box Office Collections: మంచు విష్ణుకు బిగ్ షాక్.. 'కన్నప్ప' కలెక్షన్ల డౌన్..ప్రభాస్ కూడా ఆదుకోలేడా!
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్లపై సురేష్ బాబు, సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కకుమాను - ఈ నలుగురు స్నేహితులు మళ్లీ తెరపై సందడి చేయబోతున్నారు. 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలో వీరి కెమిస్ట్రీ, కామెడీ ప్రేక్షకులను ఎంతగానో నవ్వించాయి.