Dhanush: విడాకుల తర్వాత భార్యతో కలిసి హీరో ధనుష్ ఫొటో! రజినీకాంత్ పోస్ట్ వైరల్!

గతేడాది విడాకుల తర్వాత హీరో ధనుష్ భార్య ఐశ్వర్య కలిసి ఉన్న ఫొటో నెట్టింట వైరలవుతోంది. అయితే తన పెద్ద కుమారుడు యాత్ర స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాడు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి కొడుకు గ్రాడ్యుయేషన్ సెర్మనీకి హాజరయ్యారు.

New Update
Aishwarya- Dhanush at Son's Graduation ceremony

Aishwarya- Dhanush at Son's Graduation ceremony

Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్- ఐశ్వర్య గతేడాది విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరూ తమ పెద్ద కుమారుడు యాత్ర గ్రాడ్యుయేషన్ సెర్మనీ కోసం కలిసి వెళ్లారు. అక్కడ కొడుకుతో ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ చూడడం ఆనందంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. విడాకుల తర్వాత ధనుష్ - ఐశ్వర్య కలిసి కనిపించడం ఇది రెండో సారని తెలుస్తోంది. గతంలో ఇద్దరు కుమారులు యాత్ర,  లింగ స్పోర్ట్స్ మీట్  కార్యక్రమానికి కూడా కలిసి హాజరయ్యారు. 

Also Read :  ఈ 5 వస్తువులను మామిడి పండ్లతో తింటే ఆరోగ్యానికి హానికరమని తెలుసా..?

Also Read :  బిగ్ బ్రేకింగ్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ప్రాంతాల వారీగా లిస్ట్ ఇదే

రజినీకాంత్ పోస్ట్ 

హీరో ధనుష్ కొడుకు గ్రాడ్యుయేషన్ ఫొటోలను షేర్ చేస్తూ.. యాత్ర.. తల్లిదండ్రులుగా ఈరోజు మేమిద్దరం ఎంతో గర్వపడుతున్నాం అని రాసుకొచ్చారు. మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా మనవడి గ్రాడ్యుయేషన్ ఫొటోలను ఎక్స్ లో పోస్ట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే 2004లో వివాహం చేసుకున్న ధనుష్- ఐశ్వర్య జంట.. 2022లో విడాకులు ప్రకటించింది. ఆ తర్వాత 2024లో వీరికి కోర్టు విడాకులు మంజూరు చేసింది. 

Also Read: Manchu Brothers: అంతా మనోజే చేయించాడు..కన్నప్ప హార్డ్ డ్రైవ్ విషయంలో విష్ణు సంచలన కామెంట్స్

Also Read :  భద్రాచలంలో భక్తుల రద్దీ.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

Advertisment
Advertisment
తాజా కథనాలు