ప్రతీ సీన్ ఇంటర్వెల్ లా ఉంటుంది.. 'పుష్ప2' పై హైప్ పెంచిన దేవిశ్రీ ప్రసాద్

మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఓ మీడియా ఇంటరాక్షన్ లో 'పుష్ప2' ఎలా ఉండబోతుందో చెప్పాడు. 'పుష్ప 2' ఫస్టాఫ్ చూశాను, అదిరిపోయేలా వచ్చింది. ఇందులో సీన్స్‌ చూశాక నా దిమ్మ తిరిగిపోయింది. పుష్ప వరల్డ్‌ ప్రారంభమయ్యాక ప్రతి సీన్ ఇంటర్వెల్‌లా ఉంటుందని అన్నాడు.

New Update

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప2' కోసం సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది.'పుష్ప 2' పార్ట్-1 కు 10 రెట్లు ఉంటుందని మూవీ టీమ్ ఎప్పటినుంచో చెబుతూ వస్తోంది. అయితే తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ 'పుష్ప 2' పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

Also Read : SDT18 : యోధుడిగా సాయి తేజ్.. ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఏంది సామీ

ఫస్టాఫ్ అదిరిపోయింది..

ఈ నెల 19న దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ కాన్సర్ట్‌  గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 'పుష్ప 2' ఎలా ఉండబోతుందో చెప్పాడు." నేను పుష్ప 2 ఫస్ట్ హాఫ్ చూశాను. సినిమా అదిరిపోయేలా వచ్చింది. ఇందులోని సీన్స్‌ అన్నీ చూశాక నా దిమ్మ తిరిగిపోయింది. పుష్ప వరల్డ్‌ ప్రారంభమయ్యాక ప్రతి సన్నివేశం ఇంటర్వెల్‌లా ఉంటుంది.

Also Read : Adah Sharma: ఆ ఇంట్లో ఏదో తెలియని శక్తి ఉందంటున్న ఆదా!

ప్రేక్షకులను ఏమాత్రం నిరాశ పరిచేలా సీన్లు ఉండవు. దర్శకుడు సుకుమార్‌ స్క్రిప్ట్ చెప్పినప్పుడే తెగ నచ్చేసింది. అంతే స్థాయిలో దానిని తెరకెక్కించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన స్టైల్లొ అదరగొట్టేశాడు.." అంటూ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాడు. దేవిశ్రీప్రసాద్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Also Read : ఒకే వేదికపై సూర్య, ప్రభాస్, రజినీకాంత్.. ఫ్యాన్స్ కు పండగే

మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటుంది. డిసెంబర్ 6 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read : అబ్బ అనిపించిన హెబ్బా పటేల్.. కొత్త ఫొటోలు ఏమున్నాయ్ గురూ

Advertisment
Advertisment
తాజా కథనాలు