Adah Sharma: ఆ ఇంట్లో ఏదో తెలియని శక్తి ఉందంటున్న ఆదా!

సుశాంత్ ఇల్లు ఆదా శర్మకు బాగా నచ్చిందని, ఏదో తెలియని శక్తి ఉందని పేర్కొంది.తన అమ్మమ్మతో కలిసి సుశాంత్ ఇంట్లోనే ఉంటున్నానని, ఇంట్లోకి రాగానే చాలా పాజిటివ్ గా అనిపించిందని తెలిపింది.

New Update
Adah Sharma : ఆ బాలీవుడ్ హీరో సూసైడ్ చేసుకున్న ప్లాట్ లో దిగిన నితిన్ హీరోయిన్.. ఇక్కడంతా పాజిటివ్ వైబ్స్ అంటూ కామెంట్స్!

Tollywood : క్యారెక్టర్ నటుడిగా, టెలివిజన్ నటుడిగా, ప్రెజెంటర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు దివంగత నటుడు సుశాంత్ సింగ్. ఈయన 1998 లో ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సత్య సినిమాతో సినీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చాడు. సుశాంత్ సింగ్ 14 జూన్‌ 2020 లో తన ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయారు. అయినప్పటికీ ఈ నటుడి గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఇటీవలే హీరోయిన్ ఆదా శర్మ.. సుశాంత్ ఇళ్లును కొనుగోలు చేసింది.

Also Read: ఎంబీబీఎస్ అడ్మిషన్ వివాదం .. సుప్రీంకోర్టు కీలక తీర్పు

రీసెంట్ గానే తన కుటుంబంతో  ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారట. అయితే పలువురు పబ్లిసినీ కోసమే ఆదా ఇలా చేసిందంటూ నెట్టింట వార్తలు గుప్పుమన్నాయి.తాజాగా ఆదా శర్మ ఈ వార్తలపై స్పందించి.. ఈ విధంగా రూమర్స్ క్రియేట్ చేసేవారిని అసలు పట్టించుకోనని తెలిపింది. అలాగే నటిగా తనకు ఎన్నో పనులు ఉంటాయని చెప్పింది. తాను మంచి పర్సన్ ను అని ఇతరులకు తెలియజేయాల్సిన అవసరం ఆమెకు లేదని, ఇల్లు కొనాలనిపించింది కొన్నానని వెల్లడించింది. 

Also Read: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం..గల్ఫ్‌ దేశాల ఆందోళన!

ఎవరికోసం తన పద్ధతి మార్చుకోనని తెలిపింది. అలాగే సుశాంత్ ఇల్లు ఆదా శర్మకు బాగా నచ్చిందని, ఏదో తెలియని శక్తి ఉందని పేర్కొంది.తన అమ్మమ్మతో కలిసి సుశాంత్ ఇంట్లోనే ఉంటున్నానని, ఇంట్లోకి రాగానే చాలా పాజిటివ్ గా అనిపించిందని తెలిపింది. ఇంటిని రీమోడలింగ్ చేశానని, ఫస్ట్ ఫ్లోర్ ను టెంపుల్‌లా తీర్చిదిద్దానని వివరించింది. అంతేకాకుండా ఒక రూమ్ ను డ్యాన్స్ కోసం.. మరో గదిని మ్యూజిక్ కోసం.. స్టూడియోగా చేశానని వెల్లడించింది. ఇక టెర్రస్ అయితే మొత్తం గార్డెన్‌లాగా మార్చేసినట్లు చెప్పుకొచ్చింది.

నన్ను మోసం చేసారు

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం అజయ్ దేవగన్ సరసన ‘దే దే ప్యార్‌ దే 2’లో నటిస్తోంది. ‘దే దే ప్యార్‌ దే' బ్లాక్ బస్టర్ సీక్వెల్ ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీకి అన్షుల్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.అయితే గతంలో రకుల్ కు ప్రభాస్ సరసన నటించే అవకాశం వచ్చిందట. ఆ సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ కూడా చిత్రీకరించారట.

Also Read:  ఇండియా-కెనడా యుద్ధం.. మధ్యలో బిష్ణోయ్.. వివాదానికి కారణమేంటి?

కానీ ఆ తర్వాత రెండో షెడ్యూల్ ఎన్నిరోజులైనా ఫోన్‌ రాలేదని.. తన స్థానంలో కాజల్‌ను తీసుకున్నట్లు తెలిసిందని రకుల్ తెలిపింది. తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా తొలగించారని చెప్పింది.అప్పటికే ప్రభాస్- కాజల్ కాంబోలో ఓ హిట్ సినిమా రావడంతో.. వాళ్ళ జోడీ మరోసారి రిపీట్ అయితే బాగుంటుందని భావించిన చిత్రబృందం తనను తొలగించినట్లు రకుల్ తెలిపింది.

Also Read: ఉదయం లేవగానే ఈ వస్తువులను చూశారంటే.. శని మీ చుట్టూ వైఫైలా తిరుగుతుంది!

అలాగే రకుల్ మాట్లాడుతూ.. సినిమా అనేది ఒక వ్యాపారమని. అందులోనూ పరిశ్రమకు కొత్తగా వచ్చిన అమ్మాయిలకు ఇలా జరగడం సహజమేనని.. తనకు ఎన్నో సార్లు ఇలా జరిగిందని. ఒక అవకాశం పోతే.. దానికి మించినది మన కోసం ఎదురుచూస్తుంటుందనే విషయాన్ని తాను ఎల్లప్పుడూ నమ్ముతానని తెలిపింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు