Pawan Kalyan: సినిమా హాళ్ల ఓనర్లకు పవన్ కల్యాణ్ బిగ్ షాక్.. సంచలన ప్రకటన రిలీజ్!

సినిమాహాళ్ల నిర్వహణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి. తన సినిమా అయినా సరే టికెట్ ధరల పెంపుకోసం ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలి. సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలన్నారు.

New Update
AP Deputy CM Pawan Kalyan releases sensational statement

AP Deputy CM Pawan Kalyan Releases Sensational Statement

Pawan Kalyan: ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినిమా హాళ్లను మూసివేస్తున్నట్లు నెట్టింట ప్రచారం నడిచింది. అందులోనూ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ మూవీ రిలీజ్‌కు ముందు సినిమా హాళ్ల బంద్ ప్రచారం సంచలనం రేపింది. ఈ ప్రచారం వెనుక ‘ఆ నలుగురు నిర్మాతలు’ ఉన్నారంటూ గుసగుసలు వినిపించాయి. దీనిపై పవన్ సైతం రియాక్ట్ అయి అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఒక్కక్కరుగా మీడియా ముందుకొచ్చి ఆ నలుగురిలో తాము లేమని క్లారిటీ ఇచ్చుకున్నారు. అల్లు అరవింద్, దిల్ రాజు ఇప్పటికే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. 

Also Read: కవితకు కేసీఆర్ ఫోన్!

ఇదిలా ఉంటే తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమా హాళ్ల ఓనర్లకు బిగ్ షాక్ ఇచ్చారు. ఈ మేరకు ‘సీఎంఓ’ నుంచి ఒక ట్వీట్ చేశారు. దాని ప్రకారం.. సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి అని అన్నారు. థియేటర్లలో ఆహార పానీయాల నాణ్యత, ధరలపై నియంత్రణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. తన సినిమా అయినా సరే టికెట్ ధరల పెంపు కావాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలి అని స్పష్టం చేశారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుందని అన్నారు. సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలి అని తెలిపారు.

Also Read: స్టార్ హీరోల సినిమాలతో సందడే సందడి.. ఈ వారం ఓటీటీ సినిమాల ఫుల్ లిస్ట్ ఇదే!

ఈ అవాంఛనీయ పరిస్థితికి కారకుల్లో జనసేన తరఫువాళ్ళు ఉన్నా చర్యలకు వెనుకాడవద్దని అన్నారు. రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని.. ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. కొత్త చిత్రాలు విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారికి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఇక రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  కందుల దుర్గేశ్.. సినిమాలు హాళ్ల బంద్ ప్రకటనలు, తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను, తాజా పరిణామాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వివరించారు.

దీనికి స్పందిస్తూ పవన్ కళ్యాణ్ పలు కీలక సూచనలు చేశారు. టికెట్ ధరల పెంపు అయినా, సినిమా హాళ్ల నిర్వహణ విషయం అయినా, ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను, పర్యవేక్షణను పకడ్బందీగా చేయాలన్నారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి, సంప్రదింపులు చేయాలని.. ఇందులో తనమన బేధాలు పాటించవద్దు అని స్పష్టంగా చెప్పారు. 

Also Read: దొంగ టీచర్లు..  ఏడాది జీతం దొబ్బి తిన్నారు.. స్కూల్కు వెళ్లకుండానే ఫుల్ శాలరీ!

ప్రేక్షకులు సినిమా హాల్ వరకూ రావాలంటే..?

టికెట్ ధర కంటే సినిమా హాల్లో పాప్ కార్న్ లాంటి తినుబండారాలు, కూల్ డ్రింక్స్, చివరకు మంచి నీళ్ల సీసాల ధరలు సైతం భారీగా ఉండటంపై చర్చించారు. వాస్తవంగా వాటి ధరలు ఎంత ఉంటున్నాయి?, ఎంతకు విక్రయిస్తున్నారు?, వాటిలో ఉండే నాణ్యత ప్రమాణాలు ఏంటి? అనేది కూడా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ కూడా చేపట్టాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్స్ లో ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్స్ వ్యాపారంలోను గుత్తాధిపత్యం సాగుతోందనే విషయం కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చినందున దీనిపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు.

ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాలుకు రావాలంటే తినుబండారాలు, డ్రింక్స్ ధరలు చూసి వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదని ఉప ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది.. తద్వారా పన్ను ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ అంశంపై పన్నుల శాఖతో పరిశీలన చేయించాలన్నారు. థియేటర్లలో తాగునీటి ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ అనేవి యజమానులు కనీస బాధ్యతలని, వాటిని పాటించేలా స్థానిక సంస్థలు చూసుకుంటాయన్నారు.  

సినిమా హాళ్ల బంద్ నేపథ్యంపై

తెలుగు చిత్ర రంగంలో సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు రావడానికి గల నేపథ్యం, ఆ నలుగురు ప్రమేయం, తమకు సంబంధం లేదని ఇద్దరు నిర్మాతలు ప్రకటించడం, తూర్పు గోదావరి జిల్లాలోనే తొలుత బంద్ ప్రకటన వెలువడటం, తదితర అంశాలు చర్చకు వచ్చాయి. బంద్ అంశంపై చేపట్టిన విచారణ పురోగతిని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వివరించారు. బంద్ ప్రకటన వెనక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన విషయంపైనా చర్చించారు.

ఈ ప్రకటన వెనక ఒక సినీ నిర్మాత, సినిమా హాళ్లు కలిగిన ఒక రాజకీయ నాయకుడి ప్రమేయం ఉన్నాయని సినిమా వర్గాలు చెబుతున్న క్రమంలో ఈ కోణంలో కూడా విచారణ చేయించాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు. సినిమా రంగంలో అవాంఛనీయమైన పరిస్థితులకు కారణమైన బంద్ అనే ప్రకటన వెనకగల కారణాలు తెలుసుకోవాలన్నారు. ఇందుకు కారకుల్లో జనసేన తరఫువాళ్ళు ఉన్నా చర్యలకు వెనుకాడవద్దన్నారు.

నిర్మాతలను కావచ్చు, నటులను కావచ్చు, దర్శకులను కావచ్చు... బెదిరింపు ధోరణిలో దారికి తెచ్చుకొని వ్యాపారాలు సాగించాలనుకొనే అనారోగ్యకర వాతావరణానికి తావు ఇవ్వకుండా సినిమా వ్యాపారం సాగించే ప్రోత్సాహకర పరిస్థితులను ప్రభుత్వం తీసుకువస్తుందని విషయాన్ని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి, నిర్మాతల మండలికి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, దర్శకుల సంఘాలకు తెలియచేయాలన్నారు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకురాదలచిన కాంప్రహెన్సివ్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీలో సినిమా రంగం అభివృద్ధికి సూచనలను కూడా తెలుగు సినిమా రంగంలోని సంఘాలు, మండళ్ల నుంచి స్వీకరించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Pawan Kalyan | hari-hara-veeramallu-movie | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు