Nagarjuna: మోదీని కలిసిన అక్కినేని కుటుంబం.. ఎందుకో తెలుసా?

అక్కినేని నాగార్జున కుటుంబ సమేతంగా నేడు భారత ప్రధాని మోదీని కలిశారు. ఈ మీటింగ్‌లో నాగార్జున అక్కినేని బయోగ్రఫీపై వ‌స్తున్న బుక్ గురించి చ‌ర్చించిన‌ట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

New Update
modi with nagarjuna

modi with nagarjuna

Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున సతీసమేతంగా  భారత ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. అమల, నాగార్జునతో పాటు కొత్త జంట నాగచైతన్య, శోభిత ఇతర కుటుంబ సభ్యులు కూడా వెళ్లారు. ఈ మీటింగ్ లో నాగార్జున అక్కినేని నాగేశ్వర్ రావు బయోగ్రఫీ పై వస్తున్న బుక్ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. మోదీతో భేటీ అనంతరం పార్లమెంట్ లో  ఎంపీ బైరి శబరి తో కలిసి ఫొటోలు తీసుకున్నారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 

Also Read: Prabhas Fauji: డార్లింగ్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్.. ప్రభాస్ తో సాయి పల్లవి..! SRK సినిమాలోని ఆ పాత్ర వలే

Also Read: Thandel : తండేల్ ఓటీటీ రిలీజ్ అందులోనే..? ఎంత ధరకు అమ్ముడుపోయాయంటే!

నాగేశ్వ‌ర‌రావు పై మోదీ ప్రశంసలు 

ఇది ఇలా ఉంటే ఇటీవలే మన్ కీ బాత్‌లో భాగంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ దివంగ‌త న‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావును గుర్తుచేశారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు, కృషిని ప్రశంసించారు.  మోదీ వ్యాఖ్యలకు నాగార్జున కూడా సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలియజేశారు. 

Also Read: Sankranti Ki Vastunnam OTT: ఓటీటీలోకి వెంకీ మామ బ్లాక్​బస్టర్ మూవీ - 'సంక్రాంతికి వస్తున్నాం' స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

Advertisment
Advertisment
తాజా కథనాలు