Cyclone:తరుముకొస్తున్న మిచౌంగ్..నెల్లూరుకు 20కి.మీ, బాపట్లకు 110 కి.మీ దూరంలో కేంద్రీకృతం

మిచౌంగ్ తుఫాను తరుముకొస్తోంది. ప్రస్తుతం నెల్లూరుకు 20 కి.మీ...బాపట్లకు 110 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. దీంతో పలు ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 110 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.

New Update
Cyclone:తరుముకొస్తున్న మిచౌంగ్..నెల్లూరుకు 20కి.మీ, బాపట్లకు 110 కి.మీ దూరంలో కేంద్రీకృతం

మిచౌంగ్ తుఫాను చాలా వేగంగా కదులుతోంది. గత 06 గంటల్లో 07 kmph వేగంతో ఉత్తరం వైపు కదులుతూ కేంద్రీకృతమై ఉంది. ఇది డిసెంబర్ 5న...5.30 గంటలకు పశ్చిమ బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల వైపు చాలా వేగంగా దూసుకువస్తోంది. రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఇంకా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో అక్షాంశం 14.9°N, రేఖాంశం 80.2°E దగ్గర, కావలికి తూర్పున 20 కి.మీ, నెల్లూరుకు 50 కి.మీ ఉత్తర-ఈశాన్య, చెన్నైకి ఉత్తరాన 200 కి.మీ, నైరుతి 110 కి.మీ.లలో బాపట్ల, మచిలీపట్నానికి నైరుతి దిశలో 170 కి.మీ. దగ్గరగా మేఘాలు కదులుతున్నాయి. వీటిలో కొన్ని భూభాగంలో ఉండడం వలన తుఫాను తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది.

Also Read:పీసీసీ ఛీఫ్ పదవికి రాజీనామా చేయనున్న కమల్ నాథ్..

తుఫాను దాదాపు ఉత్తరం వైపు సమాంతరంగా, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా కదులుతోంది. నెల్లూరు, మచిలీపట్నం మధ్య బాపట్లకు దగ్గరగా డిసెంబరు 5వ తేదీ మధ్యాహ్నలోపు తీరం దాటే అవకాశం ఉంది. దీనివలన గాలి తీవ్రత 90-100 కి.మీ గరిష్ట స్థిరమై, ఒక్కకప్పుడు 110 కి.మీ గాలి వీచే అవకాశం ఉంది.

మిచౌంగ్ ఎఫెక్ట్ వలన కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, భీమవరం, ఏలూరు,విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతిలలో ప్రాంతాల్లో బాగా వర్షాలు పడుతున్నాయి. వీటితో పాటూ ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లా, దివిసీమల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. నాగాయలంకలో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి.

Advertisment
తాజా కథనాలు