/rtv/media/media_files/2025/04/29/Y6Am5I8mgqpDH3OJSlx9.jpg)
IndusInd Bank CEO
ఇండస్ఇండ్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవికి సుమంత్ కథ్పాలియా తన పదవికి రాజీనామా చేశారు, బ్యాంకులో అకౌంటింగ్ లోపానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. దీనికి సంబంధించి డిప్యూటీ సీఈఓ అరుణ్ ఖురానా కూడా రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత సుమంత్ కథ్పాలియా రాజీనామా చేశారు. ఇండస్ఇండ్ బ్యాంక్లో అకౌంటింగ్ లోపాలు ఇటీవల వెలుగుచూశాయి. 2024 ఏప్రిల్ 1కు ముందు 5-7 ఏళ్లలో డెరివేటివ్ పోర్ట్ఫోలియోలో తేడాలు వచ్చినట్లుగా బ్యాంక్ గుర్తించింది. ఈ వార్తల నేపథ్యంలో బ్యాంక్ స్టాక్ దాదాపు 25 శాతం మేర నష్టపోయింది.
Also Read : Narendra Modi : పాక్ పని ఖతం.. మోడీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం!
Also Read: మోదీ తల తీసిన ఫొటో షేర్ చేసిన పాకిస్తాన్.. కాంగ్రెస్ ఏం చేసిందంటే..?
Big development....
— Arvind Datta (@datta_arvind) April 29, 2025
Sumanth Kathpalia - MD & CEO Resigns from IndusInd Bank.
Yesterday the Deputy CEO had resigned. pic.twitter.com/QAXNfjU4Q5
రూ.1959 కోట్లు నష్టం
అయితే ఈ లోపాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించేందుకు ప్రత్యేక ఏజెన్సీని బ్యాంక్ ఏర్పాటు చేసింది.సదరు సంస్థ ఏప్రిల్ 26 తన రిపోర్టును బ్యాంకుకు సమర్పించింది. అకౌంటింగ్ లోపాల వల్ల రూ.1959 కోట్లు ఇండస్ఇండ్ బ్యాంక్కు నష్టం వాటల్లినట్లుగా రిపోర్టులో వెల్లడైంది. శాశ్వత సీఈఓను నియమించే వరకు తాత్కాలికంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విధులు నిర్వర్తించడానికి కార్యనిర్వాహక కమిటీ ఏర్పాటుకు అనుమతి కోరినట్లు బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. కాగా సుమంత్ కత్పాలియా బ్యాంకింగ్ రంగంలో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఇండస్ఇండ్ బ్యాంక్లో చేరడానికి ముందు ఆయన సిటీబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ABN AMRO వంటి బ్యాంకులలో పనిచేశారు.
Also read : Indian Army: పాకిస్థాన్కు షాక్.. ఇజ్రాయెల్ సాయంతో భారత్ సరికొత్త వ్యూహం !
Also Read: పాకిస్థాన్ జిందాబాద్ అన్నాడని కొట్టి చంపేశారు.. ఎక్కడంటే?