Chandrababu: ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు ఊరట

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దర్యాప్తు విషయంలో ముందస్తు ప్రభావం ఏమీ ఉండదని కోర్టు చెప్పింది.

Chandrababu: ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు ఊరట
New Update

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దర్యాప్తు విషయంలో ముందస్తు ప్రభావం ఏమీ ఉండదని కోర్టు చెప్పింది. చంద్రబాబు దర్యాప్తుకు సహకరించకపోతే అప్పుడు బెయిల్‌ను రద్దు చేయాలి. కానీ ఈ సమయంలో కోర్టు ఇందులో జోక్యం చేసుకోదని చెప్పింది. కొన్నిరోజుల క్రితం దీని మీద ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఆయనకు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు బెయిల్ పై బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పిటిషన్ లో పేర్కొంది. దీని మీద ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

ఇన్నర్ రింగ్ రోడ్ కేసు..

ఇన్నర్ రింగ్ రోడ్(Inner Ring Road), ఉచిత ఇసుక, మద్యం అమ్మకాల అక్రమాలు చేశారంటూ ఏపీ సీఐడీ టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) మీద కేసులు నమోదు చేసింది. వీటి మీద ముందస్తు బెయిల్ అప్లై చేశారు బాబు. విచారణ అనంతరం ఏపీ హైకోర్టు(AP High Court) ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అలాగే మద్యం కేసులో నిందితుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీ నరేష్‌లకు కూడా హైకోర్టు ముందస్తు బెయిల్‌ను ఇచ్చింది. బెయిల్ ఇచ్చిన సమయంలో కొన్ని షరతులను కూడా విధించింది. 

ఇన్నర్ రింగ్ రోడ్ కేసు..

ఏపీ రాజధాని అమరావతి(Amaravati) పేరుతో చంద్రబాబు తన హయాంలో అవినీతి చేశారని ఏపీ గవర్నమెంటు ఆరోపిస్తోంది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పుల ద్వారా లింగమనేని రమేష్‌ కుటుంబంతో.. చంద్రబాబు, నారాయణ క్రిడ్‌ప్రోకు పాల్పడ్డారని అంటోంది. ఐఆర్ ఆర్ అలైన్‌మెంట్ విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా గతంలో సీఐడీకి ఫిర్యాదు చేశారు.

దీంతో, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబును ఏ-1గా పేర్కొంది. A2గా మాజీ మంత్రి నారాయణ, A14గా నారా లోకేశ్(Nara Lokesh) పేర్లను నమోదు చేసింది. చంద్రబాబుపై నమోదు అయిన కేసులపై ముందస్తు బెయిల్‌ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో అతని తరఫున లాయర్లు మూడు పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిగిన అనంతరం చంద్రబాబుకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది.

#irr-case #bail #chandrababu #petiton #supreme-court #ap-government
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe