🔴Live News Updates: యాంకర్ శ్యామల, రీతూ చౌదరిలపై కేసు నమోదు
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది.
కడపలోని కాశినాయన ఆశ్రమం అన్నదాన సత్రాన్ని ఇటీవల కూల్చివేశారు. దీనిపై శిల్పా రవి స్పందిస్తూ ‘సనాతన ధర్మాన్ని కాపాడటానికి పుట్టిన నాయకులు కాశిరెడ్డి నాయన ఆశ్రమం కూల్చివేతపై స్పందించరా?’ అంటూ పవన్పై సెటైరికల్ ట్వీట్ చేశారు. దీనిపై జనసైనికులు ఫైరవుతున్నారు.
స్వర్ణాంధ్ర విజన్-2047కి సంబంధించి పిఠాపురం, మంగళగిరి, ఉరవకొండ నియోజకవర్గాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. స్వర్ణాంధ్ర విజన్ - 2047 సాధనలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చ ఎప్పారు.
భయ్యా సన్నీ యాదవ్కు సంబంధించిన మరో వీడియోను వీసీ సజ్జనార్ షేర్ చేశారు. ‘మీ జీవితాలను బాగు చేసుకునేందుకు ఎంతో మంది జీవితాలను సర్వనాశనం చేయడం ఎంత వరకు కరెక్ట్. ఎందరో బెట్టింగ్కు బానిసలై ఆత్మహత్యలు చేసుకోవడం మీకు కనిపించడం లేదా?‘‘ అని ఫైరయ్యారు.
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ శుభవార్త చెప్పింది. వారి సిఫారసు లేఖలపై భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 24 నుంచి తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖలను టీటీడీ అనుమతించనుంది.
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఏపీ రాజధాని అమరావతికి మళ్లీ జీవం పోస్తున్నారు. ఈ క్రమంలో అమరావతి పునర్నిర్మానం పనులను ప్రారంభించేందుకు ప్రదాని మోడీని ఆహ్వానించాలని ఏపీ సీం చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు.
వైసీపీ మాజీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ (84) సోమవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంతో ఒంగోలు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి మృతి చెందారు.
కాకినాడ జిల్లా ఎస్ అచ్యుతాపురంలో ఓ కొడుకు తల్లిని చంపేశాడు. ఉద్యోగం చేయాలని మందలించడమే ఆ తల్లి తప్పయింది. క్షణికావేశంలో తల్లిని నుదుటిపై గుద్దడంతో ఆమె అక్కడిక్కడే చనిపోయింది. ఇంద్రపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు