/rtv/media/media_files/2025/04/05/61pIu2qLa7QpwbLQCjLC.jpg)
West Godavari fan draws Pawan Kalyan photo with his blood
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు ఉన్న క్రేజే వేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఆయనకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. విదేశాల్లో సైతం పవన్ కోసం పిచ్చయ్యే ఫ్యాన్స్ ఉన్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు సినిమాలతో ఎంతో మంది ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరించాడు. ఆయన సినిమా వస్తుందంటే ఫ్యా్న్స్ సంబరాలు ఓ రేంజ్లో ఉండేవి.
Also Read: చైనా కంగారుపడింది..సుంకాలపై స్పందించిన ట్రంప్
పవన్ డైలాగ్ల కోసం అభిమానులు థియేటర్లకు పరుగులు పెట్టేవారు. కానీ పవన్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి అడుగు పెట్టారో అప్పటి నుంచి సినిమాలకు కాస్త బ్రేక్ పడింది. కానీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయనే సీఎం అంటూ ఎలక్షన్లకు ముందు జనసైనికులు జోరుగా ప్రచారం చేశారు. కానీ కూటమిగా ఏర్పడటంతో డిప్యూటీ సీఎంగా పవన్ ఉన్నారు.
Also read: ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం.. కాకనాడ పోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
దీంతో పవన్ ఫ్యాన్స్ ఉత్సాహానికి అవధుల్లేకుండా పోయింది. ఇక అప్పటి నుంచి పవన్ కూడా పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను ఉన్నాననే భరోసా ఇస్తున్నారు. సినిమా కెరీర్ నుంచి రాజకీయాల్లోకి వచ్చి డిప్యూటీ సీఎంగా ఎదిగిన పవన్తో ఒక్క ఫొటో అయినా తీసుకోవాలని చాలా మందికి ఉంటుంది.
Also read: గ్రూప్-1 మెయిన్స్ టాపర్ ఈమెనే.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే!
రక్తం చిందించిన అభిమాని
ముఖ్యంగా చాలా మంది పవన్పై తమ అభిమానాన్ని వివిధ రూపాల్లో చాటుకుంటుంటారు. తాజాగా అలాంటిదే జరిగింది. పవన్ పై ఉన్న వీరాభిమానంతో ఓ యువకుడు చేసిన పనికి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఓ యువకుడు తన రక్తంతో పవన్ కళ్యాణ్ ఫొటో గీయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి వెంకట హరిచరణ్ పవన్పై అభిమానాన్ని చాటుకున్నాడు. తన రక్తంతో పవన్ కళ్యాణ్ చిత్రం గీశాడు. ఆ ఫొటో ప్రస్తుతం వైరల్గా మారింది. అది చూసి పవన్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!
(Pawan Kalyan | viral-news | latest-telugu-news | telugu-news)