తెలంగాణ బీజేపీలో విభేదాలు మరోసారి తారాస్థాయికి చేరుకున్నాయి. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి టార్గెట్ గా ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడంపై రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మీకు గులాంగిరి చేసేవాళ్లకే పోస్టులు, టికెట్ల అంటూ ఫైర్ అయ్యారు, టేబుల్ తుడిచేవాళ్లకే పెద్ద పోస్టులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు పోటీగా అంబర్పేట్ నుంచి శ్రీరామనవమి శోభాయాత్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మీరు కాదు.. మీ అయ్య ప్రయత్నం చేసినా తన యాత్రకు వచ్చే భక్తులను ఆపలేరన్నారు.
ఇది కూడా చదవండి: TG MLC Elections: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు
అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి..
గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి రాజాసింగ్ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. సీనియర్ ఎమ్మెల్యే అయిన తనకు శాసనసభ పక్ష నేత పదవి వస్తుందని ఆయన ఆశించారు. కానీ.. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన మహేశ్వరరెడ్డికి బీజేఎల్పీ నేత పదవి ఇవ్వడంతో రాజాసింగ్ అసంతృప్తికి గురయ్యారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత పేరును ప్రకటించడంపై సైతం ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు చెప్పకుండా తన ప్రాంతంలో ఎంపీ అభ్యర్థిని ఎలా ఖరారు చేస్తారని ఆయన పార్టీ నాయకత్వంపై భగ్గుమన్నారు. దీంతో హైదరాబాద్ ఎంపీ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన పాల్గొనలేదు.
ఇది కూడా చదవండి: HCU: కంచ గచ్చిబౌలీ వివాదం..తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇటీవల బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకంపై సైతం రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని స్టేట్ కమిటీ డిసైడ్ చేస్తే రబ్బర్ స్టాంప్గా ఉంటాడంటూ కామెంట్స్ చేశారు. సెంట్రల్ కమిటీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుని డిసైడ్ చేస్తే బాగుంటుందన్నారు. గతంలో ఎవరు అధ్యక్షుడు అయితే వారు గ్రూప్ తయారు చేసుకొని పార్టీకి నష్టం చేశారని ఆరోపించారు.
(kishan-reddy | telugu-news | telugu breaking news | latest-telugu-news)
నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!
కిషన్ రెడ్డి టార్గెట్ గా MLA రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. MLC అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు పోటీగా అంబర్పేట్ నుంచి శోభాయాత్ర చేస్తున్నారన్నారు. మీ అయ్య ప్రయత్నం చేసినా తన యాత్రకు వచ్చే భక్తులను ఆపలేరన్నారు.
తెలంగాణ బీజేపీలో విభేదాలు మరోసారి తారాస్థాయికి చేరుకున్నాయి. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి టార్గెట్ గా ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడంపై రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మీకు గులాంగిరి చేసేవాళ్లకే పోస్టులు, టికెట్ల అంటూ ఫైర్ అయ్యారు, టేబుల్ తుడిచేవాళ్లకే పెద్ద పోస్టులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు పోటీగా అంబర్పేట్ నుంచి శ్రీరామనవమి శోభాయాత్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మీరు కాదు.. మీ అయ్య ప్రయత్నం చేసినా తన యాత్రకు వచ్చే భక్తులను ఆపలేరన్నారు.
ఇది కూడా చదవండి: TG MLC Elections: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు
అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి..
గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి రాజాసింగ్ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. సీనియర్ ఎమ్మెల్యే అయిన తనకు శాసనసభ పక్ష నేత పదవి వస్తుందని ఆయన ఆశించారు. కానీ.. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన మహేశ్వరరెడ్డికి బీజేఎల్పీ నేత పదవి ఇవ్వడంతో రాజాసింగ్ అసంతృప్తికి గురయ్యారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత పేరును ప్రకటించడంపై సైతం ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు చెప్పకుండా తన ప్రాంతంలో ఎంపీ అభ్యర్థిని ఎలా ఖరారు చేస్తారని ఆయన పార్టీ నాయకత్వంపై భగ్గుమన్నారు. దీంతో హైదరాబాద్ ఎంపీ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన పాల్గొనలేదు.
ఇది కూడా చదవండి: HCU: కంచ గచ్చిబౌలీ వివాదం..తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇటీవల బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకంపై సైతం రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని స్టేట్ కమిటీ డిసైడ్ చేస్తే రబ్బర్ స్టాంప్గా ఉంటాడంటూ కామెంట్స్ చేశారు. సెంట్రల్ కమిటీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుని డిసైడ్ చేస్తే బాగుంటుందన్నారు. గతంలో ఎవరు అధ్యక్షుడు అయితే వారు గ్రూప్ తయారు చేసుకొని పార్టీకి నష్టం చేశారని ఆరోపించారు.
(kishan-reddy | telugu-news | telugu breaking news | latest-telugu-news)