Visakha: పాక్షికంగా కుంగిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్..!
విశాఖ రైల్వే స్టేషన్ లో మూడవ ఎంట్రెన్స్ ఎదురుగా ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పాక్షికంగా కుంగింది. అప్రమత్తమైన రైల్వే అధికారులు.. ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీదగా రాకపోకలు నిలిపివేసి మరమ్మత్తులు చేస్తున్నారు. రైలు రాకపోకలకు, ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం లేదని తెలిపారు.