Sri Bharath : టీడీపీ కూటమి మేనిఫెస్టోపై వైజాగ్ ఎంపీ అభ్యర్ధి శ్రీ భరత్ RTV తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏపీని అప్పుల పాలు చేయడం తప్ప వైసీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గెలుస్తుందనే భయంతోనే వాలంటీర్లతో రాజకీయం చేస్తున్నారన్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ఏపీని నాశనం చేసిందని మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..Also Read: కాకినాడ జిల్లా గాడిమొగలో ఉద్రిక్తత.. టీడీపీ ప్రచారాన్ని అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు..!
రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూనే ప్రజలకు సంక్షేమం అందిస్తామన్నారు శ్రీ భరత్. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. ఎన్నికల్లో తప్పకుండా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి.
[vuukle]