AP Crime: విశాఖలో దారుణం..కత్తులతో పొడిచి దంపతుల హత్య

విశాఖపట్నం దువ్వాడలోని రాజీవ్ నగర్‌లో రిటైర్డ్ డాక్‌యార్డ్ ఉద్యోగి యోగేంద్రబాబు అతని భార్య లక్ష్మి ఇద్దరినీ గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. భార్యాభర్తలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలుస్తోంది.

New Update
vishaka crime news

vishaka crime news

AP Crime: విశాఖపట్నం దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్‌లో దారుణ హత్యలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రిటైర్డ్ డాక్‌యార్డ్ ఉద్యోగి యోగేంద్రబాబు మరియు అతని భార్య లక్ష్మి ఇద్దరినీ గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. గురువారం రాత్రి 8 నుంచి 9:30 ఘటల మధ్య ఈ దారుణం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. భార్యాభర్తలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలుస్తోంది. దుండగులు ముందుగానే పక్కా పథకం వేసుకొని వచ్చి, లక్ష్మిని బెడ్‌రూమ్‌లో గొంతు కోసి హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలను కూడా దోచుకుపోయారు.

ఇద్దరి శవాలు రక్తపు మడుగులో..

ఈ సమయంలో భర్త యోగేంద్రబాబు ఇంట్లో ఉండగా, భార్యపై దాడి జరుగుతున్నదాన్ని చూశాడు. ఆమెను రక్షించబోయే ప్రయత్నంలో అతనిపై కూడా దుండగులు కత్తులతో దాడి చేశారు. యోగేంద్ర శరీరంపై 8 కత్తిపోట్లు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. అరవులు వినిపించాయని కొంతమంది స్థానికులు చెప్పినప్పటికీ.. అదేదో కుటుంబ కలహమేనేమో అనుకుని పట్టించుకోలేదని చెబుతున్నారు. దంపతులు నాలుగు రోజుల క్రితమే హైదరాబాద్‌ నుంచి తిరిగి వచ్చారు. శుక్రవారం సాయంత్రం మేనల్లుడు ఇంటికి వచ్చి తలుపులు తాళం వేసి ఉండటాన్ని గమనించి, స్థానికులను అప్రమత్తం చేశాడు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి చూడగా, ఇద్దరి శవాలు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు.

ఇది కూడా చదవండి: రక్తహీనతతో బాధపడేవారు ఇవి తప్పక తినాలి

దుండగులు హత్య అనంతరం ఇంటికి తాళం వేసి, అక్కడి నుంచి యోగేంద్ర బాబుకి చెందిన స్కూటీపై పరారయ్యారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్కూటీ మాయం కావడంతోనే ఈ కోణాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులు తెచ్చుకున్న కత్తులను కూడా వెంట తీసుకెళ్లడం ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటన వెనుక ఖచ్చితంగా ఆస్తి, నగల కోసం జరిగిన దోపిడీ ఉద్దేశమని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపారు.

ఇది కూడా చదవండి: తిరుపతిలో ఏనుగుల భీభత్సం.. రైతును తొక్కి చంపిన గజరాజులు

( ap crime updates | ap-crime-news | ap crime latest updates | latest-news )

Advertisment
Advertisment
తాజా కథనాలు