/rtv/media/media_files/2025/04/26/hjckRV6uu9lgytSIDI1F.jpg)
elephant attack
AP Crime: తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఏనుగులు భీభత్సం సృష్టిస్తున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. చిన్నగొట్టిగల్లు మండలంలోని చిట్టేచర్ల పంచాయతీ పరిధిలో ఇటీవల జరిగిన ఘటనలు స్థానిక రైతులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. ప్రకృతి అందాలకు ప్రసిద్ధి గాంచిన ఈ ప్రాంతంలో అడవి జంతువుల తాకిడి ఇలా పెరుగుతుండడం గమనార్హం.ఇటీవలి ఘటనలో కొత్తపల్లి గ్రామ సమీపంలో నివసిస్తున్న రైతు సిద్దయ్య (65)ను అడవి నుండి వచ్చిన ఏనుగులు అఘాయిత్యంగా తొక్కి చంపిన విషాద సంఘటన చోటుచేసుకుంది. మృతుడు దాసరగూడెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. తన పొలంలో వ్యవసాయ పనులు నిర్వహిస్తుండగా ఏనుగుల దాడికి గురైనట్లు సమాచారం. ఈ దాడితో గ్రామ ప్రజలు తీవ్ర భయంతో బయటకు రావడానికి వెనుకాడుతున్నారు.
మా ప్రాణాలు కాపాడండి..
అంతేకాకుండా.. గతంలో కూడా జనవరి 19వ తేదీన నారావారిపల్లె గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. అప్పట్లో ఏనుగులు ఊర్లోకి ప్రవేశించి అతడిపై దాడి చేయడం వల్ల తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ తరహా వరుస ఘటనలు రైతుల్లో తీవ్ర భయాన్ని కలిగిస్తున్నాయి. ఒకప్పుడు నిస్సంకోచంగా పొలాల్లో పనిచేసిన వారు. కానీ అడవి తీరంలో భూములు ఉండటం వల్ల పని చేయడానికి సాహసం చేయలేని పరిస్థితి నెలకొంది.
ఇది కూడా చదవండి: శృంగారం తర్వాత పురుషులకు తలెత్తే సమస్యలు ఇవే
అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఏనుగుల దాడులపై గట్టి చర్యలు తీసుకొని గ్రామాలను రక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అటవీ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి ప్రాణహానీ జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. వన్యప్రాణులను రక్షించడమే కాదు.. మానవుల ప్రాణాలకు భద్రత కల్పించడమూ ప్రభుత్వ బాధ్యత అంటున్నారు. ఈ సమస్య పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: బ్రష్ చేసేప్పుడు ఎక్కువ పేస్ట్ వేసుకుంటే ఏమవుతుంది?
( ap crime updates | ap-crime-news | ap crime latest updates | latest-news)