/rtv/media/media_files/2025/10/13/vunuta-2025-10-13-14-52-22.jpg)
డ్రైవర్ రాయుడు హత్యకేసు(kota vinutha driver rayudu case) లో తమకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు శ్రీకాళహస్తి(Srikalahasti) జనసేన(janasena) సస్పెండెడ్ నేత కోట వినుత(Vinutha Kotaa) అన్నారు. ఈ మేరకు ఆమె చెన్నై నుంచి ఓ సెల్ఫీ వీడియో చేశారు. ఈ కేసులో క్లీన్ చిట్ తో నిర్దోషిగా బయటకు వస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తమపై తప్పుడు ఆరోపణలు చేశారని, డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ ను కలిసి అన్నీ వివరిస్తామని వినుత వెల్లడించారు. తాము హత్య చేయలేదు కాబట్టే బెయిల్ వచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రజాసేవ చేసేందుకు ఫారెన్ లో రూ.లక్షల జీతాలు వదులుకున్నామని ఆమె తన వీడియోలో వివరించారు. ప్రాణాలు తీసేందుకు రాజకీయాల్లోకి రాలేదని, త్వరలోనే నిజాలు బయటకు వస్తాయన్నారు వినుత. నిజనిజాలు దేవదేవుడు శివయ్యకు తెలుసునన్నారు. కోర్టులో ఉన్నందున దీని గురించి ఎక్కువ మాట్లాడలేనని, కచ్చితమైన ఆధారాలతో త్వరలోనే మీడియా ముందుకు వస్తామని వినుత స్పష్టం చేశారు.
Also Read : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన అతి భారీ వర్షాలు
జనసేన బహిష్కృత నాయకురాలు కోట వినుత సెల్ఫీ వీడియో విడుదల..
— RTV (@RTVnewsnetwork) October 13, 2025
మనసునిండా పుట్టెడు బాధ ఉంది.. చేయని తప్పుకు జైలుకు వెళ్లినందుకు మాకు బాధ లేదు
కానీ మేము చంపామని ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తోంది..
ఎలాంటి సంబంధం లేదని ఈ కేసులో క్లీన్ చిట్ తో బయటకు వస్తాం.. చెన్నై కోర్టులో విచారణ… pic.twitter.com/V8CBeqiNym
Also Read : తీవ్ర విషాదం.. సముద్రంలో స్నానానికి వెళ్లి ముగ్గురి మృతి
ప్రైవేటు వీడియోలు పంపితే రూ.30 లక్షలు ఇస్తానని
ఇదిలా ఉండగా.. కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు ప్రైవేటుగా ఉన్న వీడియోలు పంపితే తనకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి రూ.30 లక్షలు ఇస్తానని చెప్పారంటూ వినుత మాజీ డ్రైవర్ రాయుడు గతంలో విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 19 నిమిషాల 42 సెకన్ల సెల్ఫీ వీడియో బయటకు రావడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించింది.: ఈ వీడియోలో, రాయుడు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి మనుషులు తనను సంప్రదించి, వినుత దంపతులను చంపాలని లేదా కనీసం కోట వినుత ప్రైవేట్ వీడియోలు తీసి పంపాలని బెదిరించారని, అందుకు డబ్బు కూడా ఆఫర్ చేశారని తెలిపాడు. అయితే అప్పట్లో అది అతనే తీశాడా? లేక కోటా దంపతులు బెదిరించి తీయించారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ హత్య ఘటన తరువాత కోట వినుత ఆమె భర్తను జనసేన పార్టీ సస్పెండ్ చేసింది.
శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్యకు గురయ్యారు. జూలై 7న హత్య జరిగి, జూలై 13న చెన్నైలోని కూవం నదిలో ఆయన మృతదేహం లభ్యమైంది.బఈ హత్య కేసులో కోట వినుత, ఆమె భర్త చంద్రబాబుతో సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో కోట వినుతకు చెన్నై సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆమె భర్త చంద్రబాబు (ఏ1) సహా మిగిలిన నిందితులు ఇంకా జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నట్లు తెలిసింది.