/rtv/media/media_files/2025/04/29/OLeeFT586vbzx3ngNqh2.jpg)
Gayatri
TDP Suspends Sandireddy Gayatri: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికార కూటమి ప్రభుత్వంలో ప్రధాన పార్టీగా ఉన్న టీడీపీ నేత ఒకరు సస్పెన్సన్కు గురయ్యారు. దీంతో పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు తప్పవన్న పార్టీ అధినేత హెచ్చరిక జారీ చేసినట్లయింది. వివరాల ప్రకారం తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నేత సందిరెడ్డి గాయత్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.తెలుగు మహిళ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్గా ఉన్న సందిరెడ్డి గాయత్రిపై సోషల్ మీడియాలో ఆరోపణలతో పాటుగా పార్టీ నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిసింది.
Also Read: వాడో జోకర్.. మోదీజీ పాకిస్తాన్ను FATF బ్లాక్లిస్ట్లో చేర్చండి: అసదుద్దీన్ ఒవైసీ
TDP Suspends Sandireddy Gayatri
ఈ మేరకు తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం తరఫున.. పార్టీ కార్యాలయ కార్యదర్శి అశోక్బాబు ఓ ప్రకటన విడుదల చేశారు. సందిరెడ్డి గాయత్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. 'పార్టీ నియమావళికి విరుద్దంగా సోషల్ మీడియాలో తెలుగు మహిళ స్టేట్ మీడియా కో ఆర్డినేటర్ శ్రీమతి సందిరెడ్డి గాయత్రిపై వస్తున్న ఆరోపణలతో పార్టీ నుంచి సస్పెండ్ చేసి విచారణకు ఆదేశిస్తున్నాము' అని ప్రకటనలో స్పష్టం చేశారు. కాగా గాయత్రి సస్పెన్షన్తో పార్టీలో ఒకసారిగా కలకలం రేగింది.
Also Read: Dhanush 56: పుర్రెతో ధనుష్ కొత్త సినిమా పోస్టర్.. నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్ తో
విజయవాడకు సందిరెడ్డి గాయత్రి చాలాకాలంగా టీడీపీలో పనిచేస్తున్నారు. గతంలో తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు, కార్యకర్తల విమర్శలకు సోషల్ మీడియాలో గట్టిగా కౌంటరిస్తూ పార్టీ అధిష్టానం దృష్టిలో పడ్డారు. దీంతో ఆమె పార్టీలో కీలకంగా మారారు. గాయత్రి తన దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. టీవీ చర్చా కార్యక్రమాల్లోనూ టీడీపీ వాదనను బలంగా వినిపించారు. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారు. అలాంటి అదే సోషల్ మీడియా కారణంగానే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సోషల్ మీడియా వేదికగా పలు అంశాలపై ఆమెకు వ్యతిరేకంగా పలువురు టీడీపీ నేతలు పార్టీకి ఫిర్యాదులు చేసినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఆమెను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా తన సస్పెన్షన్ పై గాయత్రి ఇంతవరకు స్పందించలేదు.
ఇది కూడా చూడండి: Pak-India:భారత్తో ఉద్రిక్తతల వేళ పాక్కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!
అయితే కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ర్టంలో టీడీపీ నాయకులు పలు సందర్భాల్లో పార్టీ లైన్ దాటుతున్నారనే అపవాదు వస్తోంది. పలువురు నేతలు బెదిరింపులు, ఆక్రమణలకు పాల్పడటం ఇటీవల కాలంలో పెరిగిపోయిందనే వార్తలు వినవస్తున్నాయి. ఏకంగా ఎమ్మెల్యేలు వైన్స్షాపులు ఇతర వ్యాపార వర్గాలను బెదిరించి వాటాలు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి పోయి పలువురిని మందలించినట్లు తెలిసింది, అయినా చాలామంది తమ తీరును మార్చుకోవడం లేదనే వాదన వినపడుతోంది.
Also Read: Balakrishna Padma Bhushan: బాలయ్య బాబుకు అభినందనల వెల్లువ.. ఎవరెవరు విష్ చేశారంటే?
media | Social Media