/rtv/media/media_files/2025/04/14/ZYtV8vUF1dbA1nH4riuK.jpg)
AP Fiber Net Corporation
AP Fiber Net : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫైబర్ నెట్ కార్పొరేషన్లో పనిచేస్తున్న 248 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా వీరంత గత వైసీపీ ప్రభుత్వంలో నియమితులైనవారు కావడం గమనార్హం. కాగా గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన వీరంతా వైసీపీ పార్టీలో క్రీయశీలకంగా పనిచేస్తున్నారనే ప్రచారం సాగింది. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీరిని తొలగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. చివరికి ఒక అవుట్ సోర్సింగ్ సంస్థతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేశారు. దీనితో ఒక్కసారిగా ఫైబర్ నెట్ కార్పొరేషన్లో 248 మంది ఉద్యోగుల్ని తొలగించారు. అయితే వీరి తొలగింపుతో ఫైబర్ నెట్ కార్యకలాపాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. దాన్ని కొత్త ఉద్యోగులతో భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read: Holiday: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఈ వారంలోనే రెండు సెలవులు!
తాజాగా తొలగించినవారిలో టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న ఉద్యోగులు కూడా ఉన్నారు. చాలామంది వైజాగ్ నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ (NOC)లో పనిచేస్తున్నారు. వీరిని తొలగించడంతో NOC దాదాపు మూతపడే పరిస్థితి వచ్చిందనే వాదన వినిపిస్తోంది. అక్కడ ఏమైనా టెక్నికల్ సమస్యలు వస్తే పరిష్కరించేవారు లేకుండాపోయారంటున్నారు. ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే మిగిలారు అంటున్నారు. కొత్తగా టెక్నికల్ సిబ్బందిని నియమించలేదని.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా తొలగించడంపై విమర్శలు వస్తున్నాయి.
ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ను బలోపేతం చేయాలని అనుకుంటున్నారు. తాజాగా ఉద్యోగుల తొలగింపుతో ఖాళీలు వచ్చాయి.. దీంతో యువతకు ఆ ఉద్యోగాలు కల్పించవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను విస్తృతంగా అందించవచ్చు అంటున్నారు. 2014--19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ను అభివృద్ధి చేశారు. కానీ ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయిందని తెలుస్తోంది.. జగన్ ప్రభుత్వంలో పైబర్ నెట్ రూ.2, 171 కోట్ల అప్పుల్లో మునిగిందని తెలుస్తోంది. ఈ ఫైబర్ నెట్ కనెక్షన్లు కూడా 12 లక్షల నుంచి 5 లక్షలకు పడిపోయాయంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫైబర్ నెట్లో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. గత ఐదేళ్లలో రూ.5,400 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగాయని.. ఇందులో దాదాపు రూ.500 కోట్ల వరకు అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఉద్యోగులుగా నియమితులైన వైఎస్సార్సీపీ కార్యకర్తలు కార్యాలయాలకు రాకున్నా వారికి జీతాలు ఇచ్చారంటున్నారు.
Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..