Posani: పోసాని కృష్ణమురళికి బిగ్ రిలీఫ్.. ఈరోజు విడుదల!

నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. ఆయనకు మంగళవారం కర్నూలు జే‌ఎఫ్‌ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. ఆయనకు పలు కేసుల్లో బెయిల్ రావడంతో ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది.

New Update
Posani Krishna Murali

Posani Krishna Murali

నటుడు పోసాని కృష్ణమురళి జైలు నుంచి విడుదలపై గందరగోళం ఇంకా కొనసాగుతోంది. ఆయనపై నమోదైన కేసుల్లో వరుసగా బెయిల్ మంజూరు కావడంతో బుధవారం జైలు నుంచి విడుదలవుతారనే ప్రచారం నడుస్తోంది. కర్నూలు మొదటి అదనపు జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్, ఆదోని న్యాయస్థానం ఇంఛార్జ్ న్యాయాధికారి మంగళవారం బెయిల్‌ మంజూరు చేశారు. ఈ క్రమంలో ఐదు రోజులుగా బెయిల్‌ పిటిషన్‌పై క్లారిటీ వచ్చింది. రూ.20 వేల పూచీకత్తు, ఇద్దరు జామీనుదారుల హామీతో బెయిల్‌ ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. దీంతో పోసాని విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది.

Also Read: Actress Ranya Rao:గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్...రన్యారావు వెనుక ప్రముఖులు., పెళ్లి వీడియో పై సీబీఐ కన్ను!

విజయవాడలోని భవానీపురం పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసులో కోర్టు విచారణ జరిపి.. గత వారం ఆయనకు ఈనెల 20 వరకు రిమాండు విధించారు. అప్పుడు కర్నూలు జైలు నుంచి పీటీ వారెంట్‌పై విజయవాడకు తీసుకొచ్చి.. అక్కడి కోర్టులో హాజరుపరిచారు. మళ్లీ ఆ తర్వాత కర్నూలు జైలుకు తరలించారు. విజయవాడ కోర్టులో పోసాని తరఫున లాయర్ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. కోర్టు మంగళవారం బెయిల్‌ ఇచ్చింది.

Also Read:  Trudeau:కుర్చీ చేత పట్టుకుని..నాలుక బయటపెట్టి..ట్రూడో ఫొటో వైరల్‌!

మరికొన్ని కేసుల్లో హైకోర్టు నుంచి బెయిల్ మంజూరైంది. పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కేసులు ఉండటంతో ఆయన విడుదలయ్యేలోపు ఇతర జిల్లాల నుంచి ఏ స్టేషన్‌ పోలీసులైనా వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లొచ్చన్న ప్రచారం కూడా నడుస్తోంది. లేకపోతే నేడు  విడుదలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తుంది. పోసాని ఈనెల 4 నుంచి కర్నూలు జైలులో ఉన్నారు.

గతప్రభుత్వం హయాంలో పోసాని కృష్ణమురళి ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ (ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫిల్మ్‌ టెలివిజన్‌ అండ్‌ థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) ఛైర్మన్‌గా పదవిలో ఉన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌‌పై పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఈ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. 

పోసానిని గత నెల 26న అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు హైదరాబాద్ గచ్చిబౌలిలో అరెస్ట్ చేసి అక్కడికి తరలించారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదు కావడంతో.. ఒకే కేసులో పోసానికి బెయిల్ మంజూరు అయితే.. మరో కేసులో ఆయన అరెస్ట్ అవుతున్నారు. మరి ఆయన ఇవాళ విడుదలవుతారా?.. ఇంకేదైనా కేసులో అరెస్ట్ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై పలు జిల్లాల్లో ఏకంగా 17 వరకు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

Also Read:  Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే!

Also Read: Ukraine: కాల్పుల విరమణకు అంగీకరించిన ఉక్రెయిన్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు