BIG BREAKING: అంబటి రాంబాబుకు బిగ్‌ షాక్.. కేసు నమోదు

వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. 'వెన్నుపోటు దినం' కార్యక్రమంలో పోలీసులను బెదిరించిన ఘటనపై తాజాగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

New Update
Ambati Rambabu

Ambati Rambabu

వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. పోలీసులను బెదిరించిన ఘటనపై తాజాగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. బుధవారం గుంటూరులో వైసీపీ ఆధ్వర్యంలో 'వెన్నుపోటు దినం కార్యక్రమం' నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి వచ్చిన అంబటి రాంబాబుకు పోలీసులతో వాగ్వాదం జరిగింది. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారని పట్టాభిపురం పోలీసు స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!  

Also Read: ముఖం చాటేసిన నైరుతి రుతుపవనాలు..మండుతుందిక్కడ

ఇక వివరాల్లోకి వెళ్తే.. వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా అంబటి.. సిద్ధార్థ్‌నగర్‌లోని తన ఇంటి నుంచి పార్టీ కార్యకర్తలతో ర్యాలీగా కలెక్టరేట్‌కు బయలుదేరారు. దీంతో పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ, ఇతర సిబ్బంది అంబటితో పాటు పార్టీ కార్యకర్తలను అడ్డుకునేందుకు యత్నించారు. తాము ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించకుండా వెళ్తున్నామని అంబటి పోలీసులకు చెప్పారు. ఈ క్రమంలోనే మాటా మాటా పెరిగి.. సీఐ, అంబటి మధ్య వాగ్వాదం జరిగింది.

Also read: ఇజ్రాయెల్ భీకర దాడులు.. 100 మంది పాలస్తీనియన్లు దుర్మరణం !

ఇక చివరికి అంబటి రాంబాబు పార్టీ నాయకులతో కలిసి కంకరగుంట ఓవర్‌ బ్రిడ్జి మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుని వినతిపత్రం అందించారు. అయితే అంబటికీ, పోలీసులకు మధ్య జరిగిన వాగ్వాదం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు విభిన్న రీతిలో కామెంట్లు చేశారు. కొందరు పోలీసులు తీరును తప్పుపడితే.. మరికొందరు అంబటి రాంబాబును విమర్శించారు. అయితే పోలీసులను బెదిరించిన ఘటనకు సంబంధించి తాజాగా అంబటి రాంబాబుపై కేసు నమోదు కావడం చర్చనీయాంశమవుతోంది. 

telugu-news | rtv-news | andhra-pradsh-news | ambati-rambabu

Advertisment
Advertisment
తాజా కథనాలు