/rtv/media/media_files/2025/06/05/SGl4lsC2DXMgVxMAwmvl.jpg)
Ambati Rambabu
వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. పోలీసులను బెదిరించిన ఘటనపై తాజాగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. బుధవారం గుంటూరులో వైసీపీ ఆధ్వర్యంలో 'వెన్నుపోటు దినం కార్యక్రమం' నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి వచ్చిన అంబటి రాంబాబుకు పోలీసులతో వాగ్వాదం జరిగింది. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారని పట్టాభిపురం పోలీసు స్టేషన్లో ఆయనతో పాటు మరికొందరు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!
సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండి..
— RTV (@RTVnewsnetwork) June 4, 2025
RTV న్యూస్ యాప్ ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్క్లూజీవ్ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV న్యూస్ యాప్ ను ప్లేస్టోర్లో అప్డేట్చేసుకోండి. ఈ కింది లింక్స్ పై క్లిక్ చేసి నేరుగా మీ… pic.twitter.com/ImFUCn2AfR
Also Read: ముఖం చాటేసిన నైరుతి రుతుపవనాలు..మండుతుందిక్కడ
ఇక వివరాల్లోకి వెళ్తే.. వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా అంబటి.. సిద్ధార్థ్నగర్లోని తన ఇంటి నుంచి పార్టీ కార్యకర్తలతో ర్యాలీగా కలెక్టరేట్కు బయలుదేరారు. దీంతో పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్ఐ, ఇతర సిబ్బంది అంబటితో పాటు పార్టీ కార్యకర్తలను అడ్డుకునేందుకు యత్నించారు. తాము ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించకుండా వెళ్తున్నామని అంబటి పోలీసులకు చెప్పారు. ఈ క్రమంలోనే మాటా మాటా పెరిగి.. సీఐ, అంబటి మధ్య వాగ్వాదం జరిగింది.
Also read: ఇజ్రాయెల్ భీకర దాడులు.. 100 మంది పాలస్తీనియన్లు దుర్మరణం !
ఇక చివరికి అంబటి రాంబాబు పార్టీ నాయకులతో కలిసి కంకరగుంట ఓవర్ బ్రిడ్జి మీదుగా కలెక్టరేట్కు చేరుకుని వినతిపత్రం అందించారు. అయితే అంబటికీ, పోలీసులకు మధ్య జరిగిన వాగ్వాదం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు విభిన్న రీతిలో కామెంట్లు చేశారు. కొందరు పోలీసులు తీరును తప్పుపడితే.. మరికొందరు అంబటి రాంబాబును విమర్శించారు. అయితే పోలీసులను బెదిరించిన ఘటనకు సంబంధించి తాజాగా అంబటి రాంబాబుపై కేసు నమోదు కావడం చర్చనీయాంశమవుతోంది.
telugu-news | rtv-news | andhra-pradsh-news | ambati-rambabu