/rtv/media/media_files/2025/04/08/Rb6rIuZEe67DQ6JzdTdu.jpg)
Pawan Kalyan younger son Photograph: (Pawan Kalyan younger son)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్కి సింగపూర్లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఓ స్కూల్లో ప్రమాదం జరగడంతో పవన్ కుమారుడు గాయపడ్డాడు. వెంటనే పవన్ కళ్యాణ్తన పర్యటన ముగించుకుని సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నారు. అయితే ఈ ప్రమాదం తర్వాత చాలా మందికి ఓ సందేహం కలిగింది. పవన్ కుమారుడిని ఇండియాలో కాకుండా సింగపూర్లో ఎందుకు చదివిస్తున్నారనే చర్చ జరుగుతోంది.
ఇది కూడా చూడండి: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?
భార్య చదువు కోసం కుమారుడిని కూడా..
పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నేవా సింగపూర్లో ఉంటున్నారు. గతేడాది ఆమె సింగపూర్లోని నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆమె చదువు కోసం కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ను కూడా సింగపూర్లో చదివిస్తున్నారు. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లి వస్తుంటారు.
ఇది కూడా చూడండి: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నేవా యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ అందుకునే కార్యక్రమానికి ఇటీవల పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అన్నా లెజ్నేవా రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ యూనివర్శిటీ నుంచి ఓరియంటల్ స్టడీస్లో డిగ్రీని పూర్తి చేశారు. ఓరియంటల్ స్టడీస్ అంటే ఆసియా దేశాల గురించి చదవడం, భాషలు, జీవన విధానం గురించి పరిశోధనలు చేయడం. వీటిలో థాయిలాండ్ చరిత్ర గురించి తప్పకుండా స్టడీ చేస్తారు. ఈ క్రమంలోనే ఆమె సింగపూర్లో ఉంటూ ఓ స్కూల్లో కుమారుడిని చదివిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!
ఈ ప్రమాదంలో పవన్ కుమారుడికి కాళ్లు చేతులకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.
ఇది కూడా చూడండి: Telangana: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!
telugu-news | latest-telugu-news | singapore | Pawan Kalyan | today-news-in-telugu | andhra-pradesh-news