/rtv/media/media_files/2025/04/26/Cic0wHwa10P3mQwWtwT8.jpg)
_Private bus overturns
AP Crime: పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. నకరికల్లు మండలంలోని శాంతినగర్ వద్ద ఉదయం హైదరాబాద్ నుండి చీరాల వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, ఒక మహిళ బస్సులోనే ఇరుక్కుపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. రెండు గంటలుగా ఓ మహిళను బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బస్సు పూర్తిగా బోల్తా పడటంతో లోపల చిక్కుకున్న మహిళను రక్షించడం కష్టం అయినప్పటికీ.. సహాయక బృందాలు నిపుణుల సహాయంతో క్షుణ్నంగా చర్యలు చేపడుతున్నాయి.
వేగంగా వెళ్తుండటమే ప్రమాదానికి..
గాయపడిన ప్రయాణికులను వెంటనే నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బస్సు ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. వేగంగా వెళ్తుండటమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్లు సమాచారం. ఎస్పీ శ్రీనివాసరావు, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఉదయాన్నే కలబంద రసం తాగితే 100 వ్యాధులు దరిచేరవు
సంఘటనాస్థలంలో ఎక్కడికక్కడ ప్రయాణికుల వస్తువులు చిందిపోవడం, గాయాలపాలైన వారు విలవిల్లాడటం అక్కడి దృశ్యాలు అందరిని తీవ్ర ఆందోళనకు గురి చేసింది. పోలీసులు, స్థానిక ప్రజలు కలిసి బాధితులను రక్షించేందుకు కృషి చేశారు. బాధితులకు అవసరమైన అన్ని వైద్య సౌకర్యాలను అందించేందుకు జిల్లా వైద్య శాఖ సన్నద్ధమవుతోంది. ప్రైవేట్ బస్సుల వేగం, నిర్వహణపై మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: విశాఖలో దారుణం..కత్తులతో పొడిచి దంపతుల హత్య
( ap crime updates | ap-crime-news | ap crime latest updates | latest-news)