APCM Chandrababu Naidu : నా గుండె బరువెక్కింది..ఏపీ సీఎం చంద్రబాబు ఎమోషనల్ పోస్ట్

దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాను మురళీనాయక్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఆయన ఎక్స్‌ వేదికగా నాయక్‌కు అంతిమ వీడ్కొలు పలుకుతున్నానన్నారు. ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల శోకంతో నా గుండె బరువెక్కిందన్నారు.

New Update

APCM Chandrababu Naidu : దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాను మురళీనాయక్‌కు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఆయన ఎక్స్‌ వేదికగా నాయక్‌కు అంతిమ వీడ్కొలు పలుకుతున్నా నన్నారు. ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల శోకంతో నా గుండె బరువెక్కిందని ఎమోషనల్‌ అయ్యారు.  ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు ఎక్స్‌లో  పోస్ట్‌ చేశారు.

ఇది కూడా చూడండి:India On Ceasefire: ఒప్పందాన్ని ఉల్లంఘించడం దారుణం..భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ

 "వీర జవాన్ మురళీ నాయక్ కు అంతిమ వీడ్కోలు పలుకుతున్నాను. ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల శోకంతో నా గుండె బరువెక్కింది. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన మురళీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. అమరవీరుడు మురళీనాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.50 లక్షల పరిహారం ఇస్తాం. 5 ఎకరాల సాగుభూమితో పాటు... 300 గజాల ఇంటి స్థలం కేటాయిస్తాం. అదే విధంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం. మురళీ నాయక్ నేడు మన మధ్య లేకపోయినా.... ఆయన దేశం కోసం చేసిన త్యాగం ఎప్పుడూ స్ఫూర్తి రగిలిస్తునే ఉంటుందని తెలుపుతూ నివాళి ఘటిస్తున్నాను.'

ఇది కూడా చూడండి: Miss World 2025: మిస్ వరల్డ్ వేదికపై.. తెలంగాణ సాంప్రదాయ నృత్యాలు.. ఫొటోలు ఇక్కడ చూడండి

కాగా వీరమరణం పొందిన జవాను మురళీనాయక్‌కు  మంత్రులు నారా లోకేశ్‌, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్‌, సవిత, సత్యకుమార్‌ నివాళులర్పించారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు వెళ్లి జవాను భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. మురళీనాయక్‌ తల్లిదండ్రులను లోకేశ్‌ ఓదార్చారు. జవాను పార్థివదేహం వద్ద నివాళులర్పించిన అనంతరం ఆయన సెల్యూట్‌ చేశారు. కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని లోకేశ్‌ భరోసా ఇచ్చారు. వీరితో పాటు ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, కందికుంట ప్రసాద్‌, మాజీ మంత్రి రఘువీరారెడ్డి తదితరులు జవాను భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. 

ఇది కూడా చూడండి: IND-PAK WAR: వైమానిక దాడులు పగలు కాకుండా రాత్రే ఎందుకు జరుగుతాయి.. సీక్రెట్ ఇదే!

ఇది కూడా చూడండి: IND-PAK WAR: వార్ ఎఫెక్ట్.. Deloitte, HCL, టెక్ మహీంద్రాతో పాటు WFH ప్రకటించిన కంపెనీల లిస్ట్ ఇదే!

#home-minister-anitha #minister-lokesh #ap cm chandrababu naidu #army jawan murali naik mother
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు