అఘోరీ - శ్రీవర్షిణి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత అఘోరీపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. పూజల పేరుతో అఘోరీ డబ్బులు తీసుకున్నారు అని ఒకరు ఫిర్యాదు చేశారు. అలాగే తనను పెళ్లి చేసుకుని మోసం చేశారంటూ రాధిక అనే మహిళ మీడియా ముందుకు వచ్చిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: రేపు ఈ 3 వస్తువులను తాకితే మీ లైఫ్ ఛేంజ్.. కష్టాలు పరార్.. ఆ వస్తువుల లిస్ట్ ఇదే!
వీరితో పాటుగా అఘోరీ తమ ట్రాన్స్జెండర్ల పరువు తీసిందని ట్రాన్స్జెండర్లు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అఘోరీ శ్రీనివాస్, శ్రీవర్షిణిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీవర్షిణిని కౌన్సింగ్ సెంటర్కు పంపించి.. ఆ తర్వాత ఆమెను తల్లిదండ్రుల వద్దకు పంపించేశారు.
Also Read: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
అఘోరీని పరామర్శించిన ఫ్యామిలీ
ప్రస్తుతం అఘోరీ చంచల్గూడ జైల్లో ఉన్నారు. అఘోరీని చూడ్డానికి ఆమె తండ్రి, అక్కా బావ చంచల్గూడ జైలుకు వెళ్లారు. ములాఖత్లో భాగంగా అఘోరీని కలిసి పరామర్శించారు. ఆపై అఘోరీకి ధైర్యం చేప్పారు. అనంతరం అఘోరీతో ములాఖత్లో మాట్లాడి బయటకి వచ్చిన తర్వాత వారు మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
మీడియా కారణంగానే అఘోరీని పోలీసులు అరెస్టు చేశారంటూ మండిపడ్డారు. అక్కడే ఉన్న మీడియా వాళ్లను తోసేసారు. తమది బెల్లంపల్లి అని.. అక్కడి వస్తే చూసుకుందాం అంటూ సవాల్ విసిరారు. కానీ ఇక్కడ మాత్రం తాము ఏమీ మాట్లాడమని.. ఎవర్నీ వదిలిపెట్టేది లేదని మీడియాని తోసేసి వెళ్లిపోయారు.
Also Read: రాజాసాబ్ ఇటలీ లోనే ఉంటాడా..? ఫ్యాన్స్లో టెన్షన్ టెన్షన్..!
aghori Arrest | aghori sri varshini | telugu-news | latest-telugu-news | Lady Aghori Family