Janasena: జనసేన కార్యకర్తలకు నాదెండ్ల కీలక పిలుపు

జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఈ నెల 14న పిఠాపురంలో పార్టీ 12వ ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్లు చెప్పారు. సభలో పార్టీ నిర్మాణంపై పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారని చెప్పారు.

New Update
Nadendla Manohar

Nadendla Manohar

ఈ 14న పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్లు ఆ పార్టీ కీలక నేత రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సభ విజయవంతానికి కార్యకర్తలు అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై శనివారం కాకినాడ కుళాయి చెరువు ఆవరణలోని కళాక్షేత్రంలో ఈ రోజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 14న పిఠాపురం నియోజవర్గంలోని చిత్రాడలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: GV Reddy: చంద్రబాబు గ్రేట్.. బడ్జెట్ సూపర్.. రాజీనామా తర్వాత జీవీ రెడ్డి సంచలన ట్వీట్!

పార్టీని బలోపేతం చేసే దిశగా సభ..

ప్రభుత్వంలో ఉంటూ పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ సభ ఉండబోతుందని వెల్లడించారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. విశాల హృదయం ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ ఆలోచన విధానాలను అనుసరించి ఈ సభను ప్రజాహితంగా నిర్వహిస్తామన్నారు. ఎనిమిది నెలల నుంచి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ఒక పక్క ప్రభుత్వాన్ని ఐక్యం చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. 
ఇది కూడా చదవండి: Posani Arrest: పవన్‌ను అందుకే బూతులు తిట్టా.. పోసాని రిమాండ్ రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు!

ఈ మేరకు పార్టీ నిర్మాణంపై జనసేనాని పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు ఈ సభలో దిశా నిర్దేశం చేస్తారని చెప్పారు. ఈనెల 14న పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఈ సభను నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉందన్నారు. అనంతరం పార్టీ సభ ఆవిర్భావ పత్రికను ఆవిష్కరించారు   

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు