Kakani: మాజీ మంత్రి కాకాణిపై మరో కేసు

కృష్ణపట్నం పోర్టు సమీపంలో అనధికార టోల్‌గేట్ ఏర్పాటు చేసి వసూళ్లకు పాల్పడిన ఘటనపై ముత్తుకూరు పోలీస్‌ స్టేషన్‌లో కాకాణిపై కేసు నమోదైంది. అయితే రిమాండ్‌లో ఉన్న కాకాణిని పీటీ వారెంట్‌పై నేడు కోర్టులో హాజరుపర్చగా వచ్చే నెల 3 వరకు రిమాండ్‌ విధించింది.

New Update
kakani

kakani

మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై మరో కేసు నమోదైంది. కృష్ణపట్నం పోర్టు సమీపంలో అనధికార టోల్‌గేట్ ఏర్పాటు చేసి వసూళ్లకు పాల్పడిన ఘటనపై ముత్తుకూరు పోలీస్‌ స్టేషన్‌లో కాకాణిపై ఇటీవల కేసు నమోదైంది. అయితే రిమాండ్‌లో ఉన్న కాకాణిని పీటీ వారెంట్‌పై నేడు కోర్టులో హాజరు పరచగా వచ్చే నెల 3 వరకు న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. మూడు కేసులు ఉండటంతో కాకాణి రిమాండ్‌ ఖైదీగా నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్నారు.

ఇది కూడా చూడండి: IND vs ENG : వాళ్లు లేకుండా ఆడటం కష్టమే.. రాహుల్ ఎమోషనల్ కామెంట్స్!

అక్రమ మైనింగ్ విషయంలో..

ఇదిలా ఉండగా క్వార్ట్జ్‌ అక్రమ మైనింగ్‌ ఇష్యూలో పొదలకూరు పీఎస్‌లో కాకాణిపై కేసు నమోదైంది. రూ.250 కోట్ల క్వార్ట్జ్‌ దోపిడీ చేశారంటూ కాకాణితో పాటు మరో ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్‌ బుక్కైంది. ఈ మేరకు రుస్తుం అక్రమ మైనింగ్‌ కేసులో కాకాణి గోవర్ధన్ ను A4గా చేర్చారు. ఈ క్రమంలోనే కాకాణిని పోలీసులు అరెస్టు చేశారు. అధికారం అడ్డంపెట్టుకుని కాకాణి అక్రమ మైనింగ్‌ చేశారంటూ మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ బాలాజీ నాయక్ ఫిర్యాదు చేశారు. 

ఇది కూడా చూడండి: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ధ్వంసమైన బ్లాక్ బాక్స్ విదేశాలకు..?

అవినీతికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో ఫిబ్రవరి 16న కాకాణి అనుచరుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వాకాటి శివా రెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డిపై కేసు నమోదు అయింది. మొత్తం పది మంది పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి ఏ1, ఏ4గా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డిలు ఏ2, వాకాటి శివారెడ్డి,  ఏ3లుగా ఉన్నారు. 

ఇది కూడా చూడండి: Jagan: 'నేనొస్తే ఆంక్షలెందుకు'.. చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు

గడువు ముగిసిన మైన్‌లో ఇష్టానుసారంగా జెలిటెన్‌ స్టిక్స్‌ ఉపయోగించడం, అర్ధరాత్రి యంత్రాలతో తవ్వకాలు చేసి క్వార్ట్జ్‌ను తరలించినట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి అప్పట్లో ఆందోళన చేశారు. అప్పటి డీడీ శ్రీనివాసకుమార్, సూపర్‌వైజర్‌ సుధాకర్, ఆర్‌ఐ హెచ్‌.దేవీసింగ్, టీఏ హసీనాబాను దీనిని పరిశీలించారు. దాదాపు 61,313 మెట్రిక్‌ టన్నుల క్వార్ట్జ్‌ను అక్రమంగా తరలించినట్లు గుర్తించి సీనరేజ్‌ ఛార్జీలతో పాటు జరిమానా విధించారు. మొత్తం రూ.7.56 కోట్లకు  షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు