AP News : ఏపీలో ఘోర ప్రమాదం.. క్వారీ పేలుడులో...

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోరవిషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మెలియాపుట్టి మండలం దీనబందుపురంలో ఉన్న వీఆర్టీ గ్రానైట్ క్వారీలో శనివారం ఉదయం భారీ పేలుడు జరిగింది.ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఈ ఘటనతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.

New Update
Quarry explosion.

Quarry explosion.

 AP News:  ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోరవిషాదం జరిగింది. జిల్లాలోని మెలియాపుట్టి మండలం దీనబందుపురంలో ఉన్న వీఆర్టీ గ్రానైట్ క్వారీలో శనివారం ఉదయం భారీ పేలుడు జరిగింది.ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతిచెందినట్లు తెలుస్తుంది.ఈ ఘటనతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. ఈ ప్రమాదంలో కార్మికులు తెర్లంగి రామారావు, బడబంద అప్పన్న, తమిళనాడుకు చెందిన వంగ వేణు ఆర్ముగం చనిపోయినట్లు  తెలుస్తుంది.  ఈ ప్రమాదంలో కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. కాగా ఈ ఉదయం క్వారీలో భారీ పేలుడు సంభవించిందని ఒకసారి, ఆ వెంటనే పిడుగు కూడా పడినట్లు  వీఆర్టీ గ్రానైట్ క్వారీ యాజమాన్యం ప్రకటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. క్వారీలో జరిపిన బ్లాస్టింగ్‌ మిస్‌ ఫైర్‌ అయి పేలడం వల్లే కార్మికులు చనిపోయారని, దాన్ని కప్పి పుచ్చడానికి పిడుగు పాటు అని అబద్ధం చెబుతున్నారని  కార్మికుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  

Also Read: RCB VS KKR: జోష్ మళ్ళీ మొదలు..ఈరోజు నుంచి ఐపీఎల్ రీస్టార్ట్
  
అయితే ఈ ప్రమాదం పై కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది అనుకోకుండా జరిగిన సాధారణ ప్రమాదం కాదని పేలుడు కారణంగానే కార్మికులు మృతిచెందారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  ఈ విషయమై క్వారీ యాజమన్యంపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కార్మికుల ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు ఘటన  స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. కార్మికుల మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతుండటంతో  దర్యాప్తు విషయంలో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిని శిక్షించాలని కార్మికుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు తగిన నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.

Also Read : ఐస్ క్రీంలో బల్లి తోక.. కట్ చేస్తే రూ.50,000 ఫైన్ - వీడియో చూశారంటే?

కాగా ఈ ప్రమాదంపై స్పందించిన వీఆర్టీ గ్రానైట్ క్వారీ యాజమాన్యం ప్రమాదంపై కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చింది. మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని, వారికి తగిన నష్టపరిహరం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అయితే, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా క్వారీ యాజమాన్యంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కార్మికుల కుటుంబ సభ్యులు కోరుతున్నాయి. అయితే క్వారీలో ప్రమాదాలను నివారించడానికి ఆయా క్వారీల యాజమాన్యాలు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ముఖ్యంగా బ్లాస్టింగ్‌ సమయంలో సరైన భద్రతా ప్రమాణాలను పాటించాలని కోరుతున్నారు. 

Also Read :  ఆల్కహాల్ బ్రాండ్ కి బాలయ్య యాడ్.. పద్మ భూషణ్ తిరిగి ఇవ్వాలంటూ నెటిజన్ల ట్రోలింగ్! వీడియో వైరల్

Advertisment
Advertisment
తాజా కథనాలు