/rtv/media/media_files/2025/02/16/9bGFosPlBGKgAMKGuvHm.webp)
Tirumala
Tirumala: వేసవిసెలువులు ముగింపునకు రావడంతో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి భక్తులతో పోటెత్తింది. శుక్రవారం టోకెన్లు లేని భక్తుల దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని ఆలయ వర్గాలు తెలిపాయి. వారాంతంలో 90 వేలకు పైగా, మిగిలిన రోజుల్లో 70 వేల నుంచి 80 వేల మంది శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అలాగే క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లలో నిండిపోయి శిలాతోరణం వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. గురువారం రోజున స్వామివారిని 69,019 మంది భక్తులు దర్శించుకున్నారు. 37,774 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.42 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Also Read : రాష్ట్రంలో వాటిని అణిచివేయడానికి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు
కాగా భక్తులకు ఇబ్బంది రాకుండా దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే భక్తుల సంఖ్యను లెక్కేసి, క్యూలో ఎంతమంది ఉన్నారో తెలుసుకొని భక్తులకు సులభ దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. క్యూలైన్లో ఎక్కడ భక్తులు ఎక్కువగా ఉన్నారు, ఎక్కడ ఖాళీ ఉంది అనే వివరాలను తెలుసుకుని రద్దీ ప్రాంతం నుంచి ఖాళీ ఉన్నచోటుకు భక్తులను పంపి తోపులాట చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. కంపార్ట్మెంట్లలోకి నిర్ణీత సంఖ్యలో మాత్రమే అనుమతిస్తున్నారు. దీనివల్ల తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా చూస్తున్నారు.
Also Read: కరోనా పేషేంట్ ని చంపేయ్.. ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకున్న ఆడియో వైరల్!
కాగా భక్తులు అధికంగా రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఏటీసీ, టీబీసీ, ఏటీజీహెచ్, కృష్ణతేజ అతిథిగృహం, రింగురోడ్డు మీదుగా శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. వారికి నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించే ఏర్పా్ట్లు చేస్తున్నారు. దీనికోసం క్యూలైన్కు ఆనుకొని 15 చోట్ల కొత్తగా ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలకు అన్నప్రసాదాలు పంపుతూ.. ఎప్పుడు, ఎంత సరఫరా చేశారో ఆ వివరాలు నమోదు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆలయ వర్గాలు తెలిపాయి.
Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్
Also Read: ఇండియాలో సివిల్ డిఫెన్స్ మాక్డ్రిల్ వాయిదా.. ఎందుకంటే?