YSRCP: వైసీపీకి బిగ్‌ షాక్‌..బీజేపీలో చేరిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం

అధికారం కోల్పొయి వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న వైసీపీకి మరో షాక్‌ తగిలింది. ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్‌ పర్సన్‌గా ఉన్న జకియా ఖానం ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు.

New Update
Zakia Khanam joins BJP

Zakia Khanam joins BJP

Big shock : అధికారం కోల్పొయి వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న వైసీపీకి మరో షాక్‌ తగిలింది. ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్‌ పర్సన్‌గా ఉన్న జకియా ఖానం ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు. ఈ మేరకు తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా లేఖను మండలి ఛైర్మన్‌కు పంపించారు. చాలాకాలంగా వైసీపీ పట్ల అసంతృప్తితో ఉన్న జకియా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్సీ రాజీనామాను ఆమోదిస్తే ఎమ్మెల్సీ స్థానంతో పాటు డిప్యూటీ ఛైర్మన్‌ పదవి కూడా ఖాళీ కానుంది.

ఇది కూడా చూడండి: IPL ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ రిలీజ్ చేసిన BCCI

 అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన జకియాఖానం ను 2020 జూలైలో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్‌ చేశారు. గడచిన రెండేళ్లుగా వైసీపీకి దూరంగా ఉంటున్న ఆమె  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి శాలువాతో లోకేష్‌ను సత్కరించారు. అప్పుడే ఆమె టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగింది. కానీ అనుహ్యంగా బీజేపీలో చేరడం చర్చనీయంశగా మారింది.  

Also Read :  వల్లభనేని వంశీకి బెయిల్!

బీజేపీలో చేరిక

ఈ రోజు ఉదయం వైసీపీకి, ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేసిన జకియా ఖానం అనుహ్య నిర్ణయం తీసుకున్నారు. జకియా ఖానం బీజేపీ కండువా కప్పుకున్నారు. ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకోవడం సంచలనంగా మారింది. జకియాకు పార్టీ కండువా కప్పిన పురంధేశ్వరి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే పార్థ సారధి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జకియా మాట్లాడుతూ  ‘ప్రధాని నరేంద్ర మోడీ కులమతాలకు అతీతంగా దేశ ప్రజలందరినీ తన బిడ్డలుగా భావించారు. వక్ఫ్ సంపదలో ముస్లిం పేదలు కూడా భాగస్వాములు కావాలని మోడీ ఆలోచించారన్నారు. తను బీజేపీలోకి వచ్చి ముస్లిం మైనారిటీలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ఆలోచించాను. నన్ను చూసి ముస్లిం మైనారిటీలు మరింత మంది బీజేపీలో చేరాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

Also Read :  పాక్ ఎయిర్ బేస్‌‌లను నాశనం చేసిన ఇండియా.. ఫొటోలు వచ్చాయ్ చూడండి

Also Read :  కాకోలాట్ జలపాతం.. ప్రకృతి ప్రేమికుల కోసం ఓ దివ్యధామం

 

ap-bjp-chief-purandeswari | bjp | tdp | ysrcp | ycp-mlc-zakia-khanam | annamayya-dist

Advertisment
Advertisment
తాజా కథనాలు