/rtv/media/media_files/2025/05/08/HNVmQQYvGAXWwD9vRDpg.jpg)
AP Tenth Marks Memos released
ఏపీ పదో తరగతి ఫలితాలు గత నెల(ఏప్రిల్) 23న రిలీజ్ అయ్యాయి. ఈ పరీక్షల్లో పాసైన విద్యార్థుల మెమోలకు సంబంధించి తాజాగా విద్యాశాఖ కీలక అప్డేట్ అందించింది. సబ్జెక్టుల వారీగా మార్కుల లిస్టుకు సంబంధించిన షార్ట్ మెమోలను రిలీజ్ చేసింది. ఈ మెమోలను పాఠశాల నుంచి తీసుకుని విద్యార్థులు ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వవచ్చు.
AP Tenth Marks Memo 2025
ఇందులో భాగంగానే ఏపీ విద్యాశాఖ అఫీషియల్ వెబ్సైట్లో షార్ట్ మెమోలను అందుబాటులో ఉంచింది. ఇదే విషయాన్ని అధికారులు వెల్లడించారు. కాగా ఈ మెమోలను స్కూల్ లాగిన్ నుంచి స్కూల్స్ హెడ్ మాస్టర్స్ డౌన్లోడ్ చేసుకుని.. ఆ తర్వాత వాటిపై సంతకం చేసి స్టూడెంట్స్కు అందజేస్తారని అధికారులు తెలిపారు.
Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్పై ఖర్గే సంచలన కామెంట్స్!
ఈ మేరకు మెమోల్లో ఏవైనా పేర్లు, డేట్ ఆఫ్ బర్త్, తండ్రి పేరు, తల్లి పేరు సహా ఏవైనా తప్పులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పుకొచ్చారు. ఈ మేరకు పాఠశాల అడ్మిషన్ రికార్డుతో పాటు హెడ్ మాస్టర్ అటాచ్ చేసిన షార్ట్ మెమో కాపీలను మే 25వ తేదీ లోగా తమకు పంపించాలని ఏపీ విద్యాశాఖ అధికారులు తెలిపారు.
Also Read: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్
ఇదిలా ఉంటే ఈసారి పరీక్షలకు మొత్తం 6,14,459 మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. ఇక రిజల్ట్స్ అనంతరం రాష్ట్రంలోని 1,680 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. అందులో 19 స్కూళ్లలో 0 శాతం నమోదైనట్లు విద్యాశాఖ తెలిపింది. ఇలా రాష్టవ్యాప్తంగా 81.14 శాతం నమోదైనట్లు ప్రకటించింది. అందులో బాలుర ఉత్తీర్ణత శాతం 78.31, బాలికల ఉత్తీర్ణత శాతం 84.09గా ఉంది.
Also Read: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!
latest-telugu-news | telugu-news | ap-tenth-results | ap-10th-exam-results