Ap Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు మృతి

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు వద్ద లారీని వెనుక నుంచి వచ్చి కారు ఢీ కొట్టింది. చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

New Update
TS: ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి..!

ap road accident

Ap Road Accident: 

ఏపీలో దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు వద్ద లారీని వెనుక నుంచి వచ్చి కారు ఢీ కొట్టింది. చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Also Read :  తొక్కిసలాట ఘటన.. కర్ణాటక సర్కార్‌ కీలక నిర్ణయం

ఏపీలో మరో ఘోరం

నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని -ఆదురుపల్లికి చెందిన జమీల అనే మహిళకు మక్బూల్ జాన్‌ అనే వ్యక్తికి మధ్య కొంతకాలంగా ఇంటి వివాదం కొనసాగుతుంది. ఈ విషయంపై ఎమ్మార్వో, ఎస్‌ఐ విచారణ చేపట్టి.. ఇల్లు ఆమెకే చెందుతుందని తేల్చి చెప్పారు. కానీ ఈ స్థల వివాదంలో సీఐ వేమారెడ్డి జోక్యం చేసుకున్నారని ఆమె తెలిపింది. 

Also Read: విమానం మెట్లు ఎక్కుతుండగా జారిపడ్డ ట్రంప్.. వీడియో వైరల్

సీఐ వేమారెడ్డి వేధింపులు భరించలేకపోతున్నానంటూ ఆ మహిళ ఒక వీడియో రిలీజ్ చేసింది. తన చావుకు సీఐ కారణమంటూ జమీల పురుగులు మందు తాగి సెల్ఫీ వీడియో తీసింది. సీఐ తనను 8 నెలలుగా ఇంట్లోకి వెళ్లనివ్వడం లేదని ఆమె ఆరోపించింది. 

Also Read: లాస్‌ఏంజెల్స్‌లో ఆందోళనలు.. రిపోర్టర్‌ కాలికి తగిలిన రబ్బరు తుటా (VIDEO)

ఈ విషయంపై పోలీసులకు చాలా సార్లు చెప్పానని.. కానీ వారెవ్వరూ పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇక పురుగుల మందు తాగిన వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో.. స్థానికులు గుర్తించి ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె రిలీజ్ చేసిన ఆత్మహత్యాయత్నం వీడియో వైరల్‌గా మారింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు