AP News: ఆ రౌడీ షీటర్లు, గంజాయి స్మగ్లర్లతో జగన్ దోస్తీ.. హోంమంత్రి అనిత సంచలన కామెంట్స్!

విజయవాడ జగన్, సజ్జలపై హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత హాట్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత జాగన్‌కి, సజ్జల రామకృష్ణారెడ్డికి లేదన్నారు. రౌడీ షీటర్లకు, గంజాయి సరఫరా చేసే వారికి వైసీపీ మద్దతుగా నిలుస్తోందని ఫైర్‌ అయ్యారు.

New Update
Home Minister Vangalapudi Anitha

Home Minister Vangalapudi Anitha

AP politics: హోంమంత్రి వంగలపూడి అనిత వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడలో విలేకరులతో అనిత మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ నాయకులు జగన్ మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు వారికే లేదని స్పష్టం చేశారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, మహిళలపై దాడులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిందని రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా పెరిగిందని విమర్శించారు. ఈ అక్రమాలకు గంజాయి సరఫరాదారులు, రౌడీషీటర్లకు వైసీపీ మద్దతిచ్చిందని ఆమె స్పష్టం చేశారు.

ప్రజల భద్రతే మాకు ముఖ్యం..

జగన్ తెనాలిలోని రౌడీషీటర్లను కలవడానికి స్వయంగా వెళ్లిన సంఘటనను గుర్తు చేశారు. ఇది వైసీపీ నేతల అసలైన ముఖచిత్రాన్ని బయటపెడుతోంది అన్నారు. రాష్ట్రంలో అల్లర్లు రెచ్చగొట్టి, కూటమి ప్రభుత్వానికి అపఖ్యాతి తీసుకురావాలని కొన్ని రాజకీయ శక్తులు కుట్రలు చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. అయితే ప్రభుత్వం అలాంటి ఏ ప్రయత్నాలను సహించబోదని ప్రజల మద్దతుతో బలంగా నిలబడుతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె నూతన పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఇది కేవలం స్టేషన్ కాదని కార్పొరేట్ మాదిరిగా సౌకర్యాలతో నిర్మించిన మోడల్‌ స్టేషన్ అని తెలిపారు. ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ అంటే ప్రజల్లో భయం ఉండేదని.. కానీ ఇప్పుడు అది పూర్తిగా మారిందన్నారు. 

 

 

ఇది కూడా చదవండి: పైనాపిల్ తిన్న తర్వాత గొంతు దురద వస్తుందా? ఇది హెల్త్‌ను పాడు చేస్తుందా?

రెండు లక్షల యాభై వేల రూపాయల నిధులతో ఈ పోలీస్ స్టేషన్ నిర్మించబడిందని తెలిపారు. శారీరక, మానసిక ఒత్తిడిని తట్టుకునే విధంగా పోలీసులకు ప్రత్యేక వ్యాయామ కేంద్రం ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. ఇన్విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఈగల్ వ్యవస్థ ద్వారా గంజాయి రవాణాపై నిఘా పెంచామని తెలిపారు. రాష్ట్రంలో నేరాల నియంత్రణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని వివరించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ వ్యవస్థను కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా తీసుకుందని.. ఇకపై ప్రజల భద్రతే మాకు ముఖ్యమని హోంమంత్రి స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: మీ స్కిన్ నిగనిగలాడలా? ఈ పానీయాలకు దూరంగా ఉండండి

( ap political | AP Political News | Latest News | home-minister | vangalapudi-anita | vangalapudi anitha latest | vangalapudi anitha latest news)

Advertisment
Advertisment
తాజా కథనాలు