/rtv/media/media_files/2025/04/11/3cNUxx8K4Z6AzEgDF3qL.jpg)
osd kollu
గనుల శాఖపై ఆరోపణలు నేపథ్యంలో ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీని చంద్రబాబు సర్కార్ పక్కన పట్టేసింది. సీఎం ఆదేశాల మేరకు ఆయన్ను ప్రభుత్వం తొలగించింది. రాజాబాబుపై అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ పట్టుపట్టి మరీ మంత్రి రవీంద్ర ఆయన్ను ఓఎస్డీగా నియమించుకున్నారు. అయితే పది నెలల పాలనలో గనులశాఖ పనితీరు, అప్పీల్ రివిజన్ కేసులపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఇవి సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే రిపోర్టు తెప్పించుకున్నారు. అనంతరం అతన్ని తొలిగించాలని అధికారులను ఆదేశించినట్లుగా తెలిసింది.
Also read : తన ఇంటి కరెంట్ బిల్లుపై ఎంపీ కంగనా రచ్చ..క్లారిఫై చేసిన విద్యుత్ శాఖ
Also Read : Manchu Manoj: వీడు కన్నప్ప కాదు 'దొంగప్ప'.. మంచు మనోజ్ సంచలన ట్వీట్!
మంత్రి కొల్లు ఓఎస్డీ తొలగింపు!
— greatandhra (@greatandhranews) April 11, 2025
గనుల శాఖపై తీవ్ర ఆరోపణల నేపథ్యంలో, మంత్రి #KolluRavindra ఓఎస్డీగా నియమించిన పి. రాజాబాబును సీఎం #ChandrababuNaidu ఆదేశాల మేరకు ప్రభుత్వం తొలగించింది.
ఆయనపై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నా, మంత్రి పట్టుబడి నియమించుకున్నారు.
మొన్న అనిత పిఏ..… pic.twitter.com/N7mQN4XFLq
ఆఫీసుకు కూడా రావడం లేదు
రాజాబాబు గత కొద్దిరోజులుగా ఆఫీసుకు కూడా రావడం లేదు. ఓఎస్డీ పోస్టు నుంచి తప్పుకుంటానని ఆయన పేషీలో చెప్పినట్లుగా సమాచారం. ఎలాగూ ప్రభుత్వం తనను తప్పించబోతోందన్న సమాచారంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. రాజాబాబు గనుల శాఖలో జాయింట్డైరెక్టర్గా పనిచేస్తూ 2024 మార్చిలో రిటైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన్ను మంత్రి కొల్లు రవీంద్రకు ఓఎస్డీగా తీసుకున్నారు. ఇప్పుడు ఆయన స్థానంలో ప్రస్తుతం గనులశాఖలో సబ్ జాయింట్ డైరెక్టర్ గా ఉన్న శ్రీనివాసచౌదరిని ఓఎస్డీగా నియమించే అవకాశం ఉంది.
Also read : Mayawati : మాయావతి మేనకోడలకు వరకట్న,లైంగిక వేధింపులు..!
Also read : ఇది మామూలు ప్లానింగ్ కాదు భయ్యా.. అమెజాన్ ఆర్దర్లతో పగ మాజీ గర్ల్ ఫ్రెండ్ పై ప్రతీకారం!