/rtv/media/media_files/2024/11/03/sbZR9y9lbjK63Yy1FTw3.jpg)
AP government key update on new ration cards
Ration cards: పేదలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మే 7నుంచి కొత్త రేషన్కార్డులకోసం దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. నెలరోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని, గ్రామ, వార్డు సచివాలయాల్లో తమ వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు.
3.28లక్షల దరఖాస్తులు..
ఈ మేరకు క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డును తీసుకురాన్నట్లు తెలిపారు. కుటుంబసభ్యుల పేర్లు స్పష్టంగా కనిపించేలా ఉండనున్నట్లు చెప్పారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే 6 నెలలుగా తీసుకున్న రేషన్ వివరాలు కూడా కనిపిస్తాయన్నారు. ఇక కొత్త కార్డుల జారీ, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం, రేషన్ కార్డు స్ల్పిట్, అడ్రస్ మార్పులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే మార్పుల కోసం 3.28లక్షల దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు.
Also Read: గుండెపోటుకు అరటిపండుతో చెక్..రోజుకు 3 తినండి
జూన్ నుంచే స్మార్ట్ కార్డులు జారీ చేస్తాం. ఇప్పటికే 95 శాతం మేర ఈ కేవైసీ ప్రక్రియ కంప్లీట్ అయింది. ఈకేవైసీ పూర్తి అయిన వారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మే 12 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం. ఈ కార్డుతో దేశవ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు అని మనోహర్ స్పష్టం చేశారు.
Also Read: హైదరాబాద్ లేడీసా మజాకా.. బ్లౌజ్ ఆఫర్ చూడగానే పరుగో పరుగు - కిక్కిరిసిపోయిన షాప్
ap govt key decision on ration cards | new ration cards rules | janasena-nadendla-manohar | today telugu news