Ap: ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం అదిరిపోయే వార్త చెప్పింది. కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం ప్రియులకు ఓ బంపరాఫర్ ప్రకటించింది. మద్యం అమ్మకాల సమయాన్ని ఎక్సైజ్ శాఖ పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. డిసెంంబర్ 31న, జనవరి 1న మద్యం షాపులు, బార్లు, క్లబ్లు, ఈవెంట్లకు రాత్రి ఒంటిగంట వరకు పని చేసేందుకు అనుమతులు ఇచ్చారు.
Also Read: Maharashtra: కేరళ మినీ పాకిస్థాన్.. అందుకే రాహుల్, ప్రియాంక గెలుపు: బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ప్రతి రోజూ రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఉన్నసంగతి తెలిసిందే. కానీ కొత్త సంవత్సరం వేడుకలు ఉండటంతో.. మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి.అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంకేముంది పండగ చేసుకుందాం మావ అంటు చిందేస్తున్నారు అంటున్నారు మద్యం ప్రియులు.
Also Read: Cricketers Retirement: బ్యాడ్ న్యూస్ ఫర్ ఇండియా.. హిట్మ్యాన్, కింగ్ రిటైర్ కావడం లేదు
మరోవైపు కొత్త సంవత్సరం సందర్భంగా బయటి రాష్ట్రాల నుంచి మద్యం ఏపీలోకి రాకుండా ఎక్సైజ్ శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు.. దాదాపు 2 రోజులపాటు సరిహద్దుల్లోని చెక్పోస్టులు, బోర్డర్ మొబైల్ పెట్రోలింగ్ పార్టీలను అలెర్ట్ చేశారు.
Also Read: TG Crime: గురుకులాల్లో ఆగని మరణాలు... ఖమ్మంలో మరో విద్యార్థి ఆత్మహత్య
రాష్ట్రంలోకి పొరుగు రాష్ట్రాల మద్యం రాకుండా తనిఖీలను ముమ్మరం చేయాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్దేవ్ శర్మ అధికారులకు ఆదేశలిచ్చారు ప్రతి చెక్పోస్టు, మొబైల్ పార్టీ పెట్టాలని.. షిఫ్టుల వారీగా రాత్రీ పగలు తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు.
Also Read: South Korea: ఫ్లైట్ అంటే భయపడుతున్నారు..68వేల బుక్సింగ్స్ క్యాన్సిల్
అలాగే కొత్త సంవత్సరం పేరుతో అదనపు వసూళ్లు చేసేవారిపైనా నిఘా పెట్టారు ఎక్సైజ్శాఖ అధికారులు.మరోవైపు ఏపీలో లిక్కర్ సేల్స్ విపరీతంగా పెరిగాయి. అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.6312 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ 75 రోజులలో మొత్తం 26,78,547 కేసులు బీర్ల అమ్మకాలు అయ్యాయి.
అలాగే 83,74,116 కేసుల మద్యం విక్రయాలు జరిగినట్లు తెలిపారు. మద్యం షాపులు, బార్లు కలిపి ఈ అమ్మకాలు జరిగాయని అధికారులు వివరించారు.డిసెంబర్ 31, జనవరి 1కి సంబంధించి వచ్చిన ఇండెంట్ బట్టి స్టాక్ పంపుతున్నట్లు ఎక్సైజ్శాఖ తెలిపింది. డిసెంబర్ 30, 31.. 2025 జనవరి 1న మద్యం అమ్మకాలు మరింత భారీగా పెరుగుతాయని ఎక్సైజ్శాఖ భావిస్తోంది.