AP: మద్యం అమ్మకాలపై ఏపీలో సిట్ దర్యాప్తు

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం హయాంలో అంటే 2019నుంచి 2024 వరకూ జరిగిన మద్యం అమ్మకాలపై సిట్ ను ఏర్పాటు చేసింది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబు ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యలతో సిట్‌ను నియమించింది.

author-image
By Manogna alamuru
New Update
Liquor

Liquor Photograph: (Liquor)

ఏపీలో కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.  వైసీపీ హయాంలో మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం దర్యాప్తుకు సిద్ధమైంది. 2019 నుంచి 2024 మధ్య మద్యం అక్రమాలపై విచారణకు సిట్  బృందం ఏర్పాటురు ఉత్తర్వులు జారీ చేసింది.  విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ఈ సిట్ ఏర్పాటైంది. ఈ దర్యాప్తు సహకరించాలని ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కు ఆదేశాలు చేసింది. 

Also Read: USA: హెచ్ 1 బీ ఆటో రెన్యువల్ రద్దు చేస్తారా?

 

ఏడుగురుతో సిట్ బృందం..

 మద్యం అక్రమాలపై ఏర్పాటు చేసిన సిట్ బృందంలో..  విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు  చీఫ్‌గా వ్యవహరిస్తారు.  ఇందులో  సభ్యులుగా ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ ఎస్పీ సుబ్బారాయుడు, సీఐడీ ఏఎస్పీ శ్రీహరిబాబు, అదనపు ఎస్పీ కొల్లి శ్రీనివాస్, డోన్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శివాజీలను నియమించారు. ఏపీ సీఐడీ డీఐజీ ఆధ్యర్వంలో సిట్ పనిచేయనుంది. ఈ సిట్ చేస్తున్న దర్యాప్తు వివరాలను ప్రతి 15 రోజులకు ఓసారి ప్రభుత్వానికి వివరాలు తెలియజేయనుంది. ఇక ఈ దర్యాప్తు బృందానికి పూర్తి అధికారాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. 2019 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు రాష్ట్రంలో మద్యం విక్రయాలకు సంబంధించి రూ.90వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి.  నగదు లావాదేవీలతో పాటు హోలో గ్రామ్‌ల వ్యవహారంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్టు చెబుతున్నారు. 

Also Read: TS: షాద్ నగర్ ప్రైవేట్ పాఠశాలలో ఘోరం..విద్యార్థి ఆత్మహత్య

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP DSC Hall Tickets: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ రిలీజ్.. ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్స్ ఎప్పుడంటే?

ఏపీలో మెగా DSC పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 6 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. డైలీ రెండు సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు ఉటాయి. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

New Update
AP DSC 2024 teacher recruitment exam dates revised

AP DSC 2024 teacher recruitment exam dates revised

ఏపీలో మెగా DSC అభ్యర్థులకు సర్కార్ అదిరిపోయే అప్డేట్ అందించింది. మెగా డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఏపీ విద్యాశాఖ రిలీజ్ చేసింది. ఈ మేరకు ఏపీ మెగా డీఎస్సీ (AP Mega DSC 2025)  హాల్ టికెట్లు విడుదలయ్యాయి. జూన్ 6వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు DSC పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. 

పలు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు

ఈ పరీక్షలకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవడంతో ఆయా రాష్ట్రాల్లో కూడా పరీక్షలు ఏర్పాటు చేయనున్నారు. ఈ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ప్రతిరోజు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్ జరుగుతుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. 

ఈ లింక్ క్లిక్ చేసి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి.. https://apdsc.apcfss.in/

Also Read: పాకిస్తాన్ గేమ్ క్లోస్.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ ఏంటంటే?

ప్రాథమిక కీ తేదీ

ఈ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఉంటుంది. లాస్ట్ ఎగ్జామ్ పూర్తయిన తర్వాత 2వ రోజు నుంచి ప్రాథమిక కీ రిలీజ్ చేయనున్నారు. ఈ ప్రాథమిక కీ పై అభ్యంతరాలు ఏవైనా ఉంటే వాటి కోసం 7 రోజుల సమయం ఇవ్వనున్నారు. ఇక అభ్యంతరాలు పూర్తైన తేదీ నుంచి మరో 7 రోజుల తర్వాత ఫైనల్ కీ రిలీజ్ చేయనున్నారు. ఇలా ఫైనల్ కీ రిలీజ్ చేసిన 7 రోజుల్లో DSC రిజల్ట్స్ ప్రకటించనున్నారు. 

16,347 టీచర్‌ పోస్టులు

ఏపీలోని ప్రభుత్వ స్కూల్‌లలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్‌ పోస్టుల భర్తీ కోసం సర్కార్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ పోస్టులకు మొత్తం 3.35 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దరఖాస్తులు రావడంతో మొత్తం 5, 77, 417 అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి 7159 మంది దరఖాస్తు చేసుకున్నారు.  అదే సమయంలో ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధికంగా 39,997 మంది మెగా డీఎస్సీకి అప్లై చేసుకున్నారు. అత్యల్పంగా 15, 812 మంది కడప జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్నారు. 

Advertisment
Advertisment