/rtv/media/media_files/2025/07/12/janasena-srikala-hasthi-in-charge-2025-07-12-11-49-27.jpg)
శ్రీకాళహస్తి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి కోట వినుతను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆమెపై హత్య కేసు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ హైకమాండ్ ప్రకటనలో పేర్కొంది. చెన్నైలో కాళహస్తి యువకుడి దారుణహత్య వార్త సంచలనంగా మారింది. రాయుడు అనే యువకుడు కూవం నదిలో శవమై తేలాడు. ఆ యువకుడిని ఐదుగురు వ్యక్తులు చిత్రహింసలు పెట్టి చంపినట్లు తెలుస్తోంది. నిందితుల్లో కాళహస్తి జనసేన ఇంఛార్జ్ వినూత, భర్త చంద్రబాబు ఉన్నట్లు వార్తలు రావడం ఏపీ పాలిటిక్స్ లో సంచలనంగా మారింది.
ఇది కూడా చదవండి: BIG BREAKING : మర్డర్ కేసు.. జనసేన నేత వినుత, చంద్రబాబు అరెస్ట్!
పార్టీ నుంచి శ్రీమతి వినుత కోట బహిష్కరణ pic.twitter.com/4waxQH0icN
— JanaSena Party (@JanaSenaParty) July 12, 2025
ఈ క్రమంలో చెన్నై పోలీసులు ఈ కేసులో అనుమానితులుగా ఉన్న వినూత, చంద్రబాబు, శివకుమార్, గోపి, దాసర్ ను అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ అరెస్ట్ నేపథ్యంలో జనసేన పార్టీ సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఈ క్రమంలో విజితను జనసేన కాళహస్తి నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించడమే కాకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Prakash Raj : ఈ రేంజ్కి అమ్ముకోవడమా? ఛీ.. ఛీ.. పవన్ పై రెచ్చిపోయిన ప్రకాష్ రాజ్ !
డ్రైవర్ను హత్య చేసిన జనసేన ఇన్చార్జ్ దంపతులు
— Telugu Feed (@Telugufeedsite) July 12, 2025
శ్రీకాళహస్తి @JanaSenaParty ఇన్చార్జ్ కోటా వినూత, భర్త చంద్రబాబు అరెస్ట్
గోడౌన్లో డ్రైవర్ రాయుడును చిత్రహింసలకు గురిచేసి హత్య చేసి నదిలో పడేసిన దండుగులు
డ్రైవర్ హత్య కేసులో వినూత దంపతుల అరెస్ట్.. చెన్నైలోని కూవం… pic.twitter.com/2XRz6Fh5Qo
ఇది కూడా చదవండి:BIG BREAKING: నెల్లూరు జిల్లా కోవూరులో కలకలం.. మీటింగ్ లోనే పురుగుల మందు తాగిన టీడీపీ కార్యకర్త!