Andhra Pradesh budget: ఫస్ట్ టైం పెన్‌డ్రైవ్‌లో ఏపీ బడ్జెట్ వివరాలు !!

2025-26 ఏపీ బడ్జెట్‌కు ఓ ప్రత్యేకత ఉంది. మొదటి సారిగా బడ్జెట్ పత్రులను ముద్రించకుండా పెన్‌డ్రైవ్‌ రూపంలో పంపించనున్నారు. ప్రస్తుత బడ్జెట్‌ పుస్తకాల ముద్రణకు స్వస్తి పలికింది. పద్దుల వివరాలు పెన్‌డ్రైవ్ రూపంలో సభ్యులకు, మీడియాకు ఇవ్వనున్నారు.

New Update
budget pendrive

budget pendrive Photograph: (budget pendrive)

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో శుక్రవారం (ఈరోజు) 10 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2025-26 బడ్జెట్‌కు ఓ ప్రత్యేకత ఉంది. మొదటి సారిగా బడ్జెట్ పత్రులను ముద్రించకుండా పెన్‌డ్రైవ్‌ రూపంలో పంపించనున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి పైయ్యావుల కేశవులు బడ్జెట్ ప్రతులను ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇచ్చారు. కేబినెట్ మీటింగ్‌లో బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ కొత్త సంస్కరణ తీసుకువచ్చింది. ప్రస్తుత బడ్జెట్‌ పుస్తకాల ముద్రణకు స్వస్తి పలికింది. పద్దుల వివరాలు పెన్‌డ్రైవ్ రూపంలో సభ్యులకు, మీడియాకు ఇవ్వనున్నారు. 

Also Read: Ravi Praksh: TV9 లోగో వివాదం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!

ఆర్థిక మంత్రి శాసనసభలో బడ్జెట్ ప్రసంగం చేస్తారు. సభలో బడ్జెట్ చదివే సమయంలో సభ్యులు చూసుకునేందుకు వీలుగా ఆ ప్రసంగం పుస్తకం ఒక్కటే ముద్రించి శాసనసభ సభ్యులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. బడ్జెట్‌కు సంబంధించి అనేక వివరాలతో 28 రకాల పుస్తకాలు ముద్రించేవారు. వీటితో పాటు ప్రతి ప్రభుత్వశాఖ తన మంత్రిత్వశాఖ అంశాలతో పుస్తకాలు వెలువరించేవి. బడ్జెట్ డిమాండ్లు, గ్రాంట్లు, బడ్జెట్ స్వరూపం అన్న పేరుతో ఈ శాఖ కేటాయింపులు ఒక పుస్తకం , అప్పటి వరకు ఆ ప్రభుత్వ శాఖ సాధించిన ఫలితాలతో ఒక పుస్తకం ప్రింట్ చేసేవారు. వాటిని తెలుగు, ఆంగ్లంలో కూడా ముద్రించేవారు. ప్రస్తుతం పెరిగిన టెక్నికల్ కారణంగా బడ్జెట్ ప్రతులు ముద్రించడం ఆపేశారు. 

Also Read: AP: ఓబులవారి పల్లె పీఎస్ ముగిసిన పోసాని విచారణ

వీటి వ్యయం చాలా ఎక్కువ ఉంటోందని ఆర్థికశాఖ అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో వాటి ముద్రణకు స్వస్తి పలికి ఖర్చు తగ్గించుకోవాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌తో చర్చించి  నిర్ణయం తీసుకున్నారు.


 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PM Modi-CM Revanth: ఆ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి.. మోదీకి సీఎం రేవంత్ రిక్వెస్ట్!

ప్రధాని నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలిశారు. మెట్రో ఫేజ్-2తో పాటు రీజినల్ రింగ్ రైల్వేకు సహకారం అందించాలని కోరారు. తెలంగాణలోని డ్రైపోర్టు నుంచి ఏపీలోని బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయాలని కోరారు

New Update
Telangana CM Revanth PM Modi

Telangana CM Revanth PM Modi

హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-II విస్తరణ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. నేడు మర్యాదపూర్వకంగా పీఎంను కలిసన రేవంత్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రధాన అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులను ప్రస్తావించిన ముఖ్యమంత్రి వాటి నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. గతంలో హైదరాబాద్ లో నిర్మించిన 69 కి.మీ మెట్రో ఫేజ్-I తరువాత నగర విస్తరణకు అనుగుణంగా 76 కి.మీ పొడవుతో ఐదు కారిడార్ల ఫేజ్-II ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్రానికి పంపామని గుర్తుచేశారు. రూ. 24,269 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ జాయింట్ వెంచర్ (జెవీ) ప్రాజెక్టులో కేంద్ర వాటా 18 శాతం కాగా, రాష్ట్ర వాటా 30 శాతమని తెలిపారు. ఇటీవలి కాలంలో చెన్నై, బెంగళూరుకు ఆమోదించిన మెట్రో ప్రాజెక్టుల ఆధారంగా హైదరాబాద్ ప్రాజెక్టుకు కూడా అనుమతి ఇవ్వాలన్నారు.

హైదరాబాద్ మహానగరం చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు (RRR)ను సమగ్రంగా అభివృద్ధి చేయాలని, ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని కూడా ఒకేసారి ప్రారంభించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఇప్పటికే భూ సేకరణలో పురోగతి ఉన్న ఉత్తర భాగం పూర్తయ్యేలోపు దక్షిణ భాగాన్ని చేపట్టకపోతే వ్యయం పెరిగే ప్రమాదం ఉందని వివరించారు. భూసేకరణ వ్యయంలో 50 శాతం భారాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు (RRR)కు సమాంతరంగా 370 కి.మీ పరిధిలో రీజినల్ రింగ్ రైల్వే (Regional Ring Railway) లైన్ నిర్మించాల్సిన అవసరం ఉందని, దీనికి కూడా కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయండి..

తెలంగాణలోని డ్రైపోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం (బందరు) పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయాలని కోరారు. ఔషధ ఎగుమతులు, తయారీ రంగ అభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM)కు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తోందని ప్రధానమంత్రికి సీఎం వివరించారు. సెమీకండక్టర్ పరిశ్రమలో తెలంగాణ కీలకపాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రముఖ R&D కేంద్రాలు, మౌలిక వసతులు, నైపుణ్యం గల మానవ వనరులు ఉన్నాయని పేర్కొన్నారు. 

తెలంగాణ ప్రతిపాదించిన ISM ప్రాజెక్టుకు ఆమోదం తెలిస్తే, పెట్టుబడులు, ఉద్యోగాలు పెరుగుతాయన్నారు. హైదరాబాద్ మొదటి నుంచి రక్షణ రంగంలో కీలకంగా ఉంటోన్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ రంగంలో MSMEలకు ప్రోత్సాహం అవసరమన్నారు. హైదరాబాద్ – బెంగళూరు డిఫెన్స్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా తెలంగాణకు సమానంగా మద్దతు ఇవ్వాలన్నారు.

(cm-revanth-reddy | narendra-modi | telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment