/rtv/media/media_files/2025/04/06/aPkMPjDApiq0jmwAaugy.jpg)
AP - TG Heavy Rain Alert
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఏపీ, తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. ఇప్పుడు మరింతగా బలపడింది. దీంతో బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ మధ్య తీరం దాటింది. ఈ క్రమంలో రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
హైదరాబాద్లో అమానుషం.. కారుపై గీత పడ్డందుకు ఖతం చేశాడు!
ఏపీలో భారీ వర్షాలు
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయిని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇందులో భాగంగానే తీరం వెంట 30 - 40 కిలోమీటర్ల వేగంతో గాలులు తీవ్రంగా వీస్తాయని పేర్కొంది. అందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇప్పటికే ఏపీలో నైరుతి పవనాలు విస్తరించాయి. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ జిల్లాలో భారీ వర్షం పడనున్నట్లు తెలిపింది.
వివో మామ దించేశాడు భయ్యా.. రెండు కిర్రాక్ స్మార్ట్ఫోన్లు అదిరిపోయాయ్!
అదే సమయంలో అనకాపల్లి, కాకినాడ, కోనసీమతో పాటు మరికొన్ని జిల్లాల్లోనూ మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ముఖ్యంగా కోస్తాంధ్రలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అదే సమయంలో రాయలసీమలో నంద్యాల, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.
కమల్ హాసన్కు బిగ్ షాక్.. ‘థగ్ లైఫ్’ మూవీ బ్యాన్..!
తెలంగాణలో ఎల్లో అలర్ట్
ఇక తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అందులో రానున్న మూడు రోజులు హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో జూన్ 2వ తేదీ వరకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. నిన్న (గురువారం) కొత్తగూడెం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు దంచికొట్టాయి. అదే సమయంలో మహబూబాబాద్, ఆదిలాబాద్, కొత్తగూడెం, సిరిసిల్ల, నిర్మల్, కామారెడ్డి, ఖమ్మం, జగిత్యాల, జనగాం, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.