/rtv/media/media_files/2025/06/24/andhra-pradesh-anantpuram-robbery-on-chengalpattu-express-2025-06-24-09-19-55.jpg)
andhra pradesh anantpuram robbery on chengalpattu express
ఏపీలో సినిమాను తలపించేలా ఓ రైలులో భారీ దోపిడీ జరిగింది. సిగ్నల్ వైర్లు కట్ చేసి.. రైలును ఆపి.. ప్రయాణికుల నుంచి డబ్బు, బంగారు ఆభరణాలు దోచుకుని పారిపోయారు. ఈ ఘటనతో రైలులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: ఇజ్రాయెల్, అమెరికాపై దాడులకు సిద్ధం.. ఇరాన్ సంచలన హెచ్చరిక
ట్రైన్ సిగ్నల్ కట్ చేసి
అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో కొందరు దుండగులు సిగ్నల్ కేబుల్ కత్తిరించారు. దీంతో ముంబై నుంచి చెన్నైకి వెళ్తున్న చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆగిపోయింది. వెంటనే బోగీల్లోకి చొరబడిన దుండగులు ప్రయాణికులను భయపెట్టి బెదిరించారు. అనంతరం వారి వద్ద ఉన్న డబ్బులు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. .
Also Read: ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి కష్టమేనా ? రవిప్రకాశ్ సెటైరికల్ ట్వీట్
ఆపై అక్కడ నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో రైలులో ఉన్న ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. బాధిత ప్రయాణికులు రేణిగుంట రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: ఇజ్రాయెల్, అమెరికాపై దాడులకు సిద్ధం.. ఇరాన్ సంచలన హెచ్చరిక
మరో ఇన్సిడెంట్
ఇది కాకుండా మరో ఇన్సిడెంట్ కూడా జరిగింది. చెన్నై ఎగ్మోర్ ట్రైన్లో కూడా దొంగలు హల్ చల్ చేశారు. క్రాసింగ్ కోసం రామలింగయ్య పల్లి రైల్వే స్టేషన్లో ఎగ్మోర్ ట్రైన్ ఆగింది. అనంతరం ట్రైన్ కదిలే టైంలో దివ్యభారతి అనే మహిళా ప్యాసింజర్ మెడలో ఉన్న 30 గ్రాముల బంగారు గోలుసును ఓ దొంగ లాక్కొని పారిపోయాడు. ఆమె మెడలోంచి మాత్రమే కాకుండా మరికొందరిని మెడల్లో నుంచి కూడా బంగారు గోలుసులు కొట్టేశాడు. బాధితులు దివ్యభారతి రైల్వే పోలీసులకు కంప్లైంట్ చేశారు.
Anantapur Incident | AP News | Train robbery