Nellore: ట్రైన్లో దోపిడీ దొంగల హల్చల్.. సిగ్నల్ను ట్రాప్ చేసి
అల్లూరు రైల్వే స్టేషన్, పడుగుపాడు రైల్వే స్టేషన్లల మధ్య వెళ్తున్న చండీగఢ్ - మదురై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్టేషన్ కంటే ముందే రైలును ఆపేసి దోపిడీకి తెగబడ్డారు. S2, S4, S5కోచ్లలో కత్తులు చూపించి బంగారు నగలు, బ్యాగులను ఎత్తుకెళ్లారు.